Ramesh Nalam
Author- NTV Telugu-
Galla Jayadev: దావోస్ సదస్సులో టీడీపీ ఎంపీ
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కూడా ఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి […] -
VijayaSaiReddy: పొత్తులు లేకుండా గెలిచి జగన్ చరిత్ర సృష్టించారు
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఏపీలో వైసీపీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ సీట్లకు 151 సీట్లను, 25 పార్లమెంట్ సీట్లకు 22 సీట్లను కైవసం చేసుకుని రికార్డు మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీని మట్టికరిపించి కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ అద్భుత విజయం సాధించిన తేదీ మే 23. ఈ నేపథ్యంలో మరిచిపోలేని విజయాన్ని గుర్తు చేసుకుంటూ సోమవారం నాడు వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. Somu Veerraju: ఏపీని అభివృద్ధి […] -
Umran Malik: 14 మ్యాచ్లు ఆడి రూ.14 లక్షలు సంపాదించాడు
ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ ప్రతిభతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్లోనూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలమైనా లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్లు ఆడింది. సన్రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఉమ్రాన్ మాలిక్ ఆడగా ప్రతి మ్యాచ్లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ […] -
Botsa Satyanarayana: ఎమ్మెల్సీ అనంత్బాబు సస్పెన్షన్పై పార్టీ పెద్దలదే నిర్ణయం
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన కారులో డ్రైవర్ డెడీబాడీ దొరకడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్సీ విషయంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తారో లేదో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. బీసీ సంఘానికి జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. Nara […] -
Viral Video: రైలు ఎక్కిన వందలాది ఆర్టీసీ బస్సులు
సాధారణంగా రైళ్లు రైలు పట్టాలపై, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరులోని ఓ రైల్వేస్టేషన్లో బస్సులన్నీ రైలెక్కి కూర్చున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటివరకు మనం గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాలనే తరలించడం చూశాం. కానీ తొలిసారిగా ఆర్టీసీ బస్సులను అధికారులు గూడ్స్ రైలులో రవాణా చేశారు. Bharat Bandh: ఈనెల 25న భారత్ బంద్.. ఎందుకంటే..? బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ […] -
Botsa Satyanarayana: చంద్రబాబుకు ఏపీలో పర్మినెంట్ అడ్రస్ ఉందా?
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి […] -
IPL 2022: సన్రైజర్స్ మోస్తరు స్కోరు.. చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ గెలిచేనా?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియం గార్గ్ (4) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు. అతడు 43 పరుగులు చేశాడు. Team India: కెప్టెన్గా కేఎల్ […] -
Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వారం పాటు 144 సెక్షన్
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పేరు మార్చాలని ఆందోళనలు, నిరసనలు జరగ్గా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ కొందరు వ్యతిరేక గళం చాటుతుండటంతో గందరగోళం నెలకొంది. Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వారం రోజుల […] -
Telugu Desam Party: ఈనెల 26న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ
ఈనెల 26న అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాలపై కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై […] -
Hyderabad: ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘వాక్ ఫర్ హెల్తీ స్పైన్’
వెన్నెముక, వెన్ను సమస్యలపై అవగాహన పెంచేందుకు ఏషియన్ స్పైన్ హాస్పిటల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ (NGO), నానో హెల్త్ కలిసి పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి. ఈ మేరకు ‘హెల్తీ స్పైన్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ నుంచి ‘వాక్ ఫర్ హెల్తీ స్పైన్’ వాక్థాన్ను నిర్వాహకులు చేపట్టారు. ఈ వాక్థాన్కు హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు (జలమండలి) ఎండీ దానకిషోర్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ వహీద్, బ్రాడ్రిడ్జ్ ఛైర్మన్ వి.లక్ష్మీకాంత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. […]
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?