టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతని మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చిట్ చాట్లో భాగంగా.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీర్ఎస్ కు 88 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికలు ఉన్నపుడల్లా కాంగ్రెస్ ముహూర్తాలు పెట్టడం మాములేనని విమర్శించారు. తాము 95 శాతం అభ్యర్థులకు బి ఫార్మ్ లు ఇచ్చామన్నారు.
మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన DNAలో బీజేపీ పై పోరాటం చేసేది ఉన్నది అని రాహుల్ గాంధీ అన్నారని.. రేవంత్ రెడ్డి DNA లో ఏమి ఉన్నది అని రాహుల్ గాంధీని అడుగుతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తన ప్రచార జోరును పెంచారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు ప్రచారంలో ముందుకెళ్తుండగా, మరోవైపు పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని జడ్చర్ల డీసీఎం అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని.. రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి…
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో అంబర్పేట శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు పెద్దపీట వేశారని తెలిపారు. గత ప్రభుత్వాలు ముదిరాజులను విస్మరించారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముదిరాజులను అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో హస్తం పార్టీ 33 మంది అభ్యర్థులను ప్రకటించింది. విడుదలైన తొలి జాబితాలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ టోంక్ నుండి పోటీ చేయనుండగా.. లక్ష్మణ్గఢ్ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసారాలు ఎన్నికల బరిలో ఉన్నాడు. సీపీ జోషికి నాథ్ద్వారా నుంచి టికెట్ లభించింది.
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహింహులు పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి హల్చల్ చేశారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు. దళితబంధు అమలు కాకుంటే తాను చస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు దళితబంధు అమలు కావటం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. దళిత యువత తనకు మెసేజ్ లు చేసి తనను చనిపోమని అంటున్నారని పేర్కొన్నారు.
ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి.