ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉదయం మణికొండలోని ఆయన నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటిలో తనిఖీలు చేశారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. ఈ క్రమంలో తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ దాడులకు రోహిత్ రెడ్డి భయపడేది లేదని తెలిపారు. నిన్న హైదరాబాద్ లోని తన మిత్రులు, వ్యాపారాలకు సంబంధించి 14…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందని ఆరోపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని తెలిపారు.
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్కడ నిర్వహించిన రోడ్డు షోలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ గెలుపు కొరకు పనిచేస్తుందని చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని లూటీ చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరి పై 94 వేల రూపాయల అప్పు చేశారని తెలిపారు.
కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.. కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని తెలిపారు. అంతేకాకుండా.. ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ జగిత్యాల ప్రజాశీర్వదా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆగం కావద్దు నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు. జగిత్యాలలో ఎవరు గెలుస్తారో ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో, 10 ఏండ్ల BRS పాలన ఎలా ఉందో గమనించాలని కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి జీవన్ రెడ్డి సమైక్య ఆంధ్రుల తరపున తన పై పోటీ చేశారని కేసీఆర్ తెలిపారు.…