Amit Shah: గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసింది..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. ట్రైబల్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామని తెలిపారు. మరోవైపు.. పోడు పట్టాల కోసం గిరిజన, గిరిజనేతరుల మధ్య బీఆర్ఎస్ విభేదాలు సృష్టించిందని ఆరోపించారు. గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. ఓ గిరిజన నేత ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన సర్కార్ మోదీ సర్కార్ అని అన్నారు
Uttarakhand Tunnel: రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు.. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభం..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
దేశంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికంగా బీజేపీలోనే ఉన్నారని అమిత్ షా తెలిపారు. 2013-14 వరకు దేశం మొత్తంలో గిరిజనులకు బడ్జెట్ తక్కువగా ఉండేది కానీ.. బీజేపీ వచ్చాక పెంచారని అన్నారు. ఏకలవ్య పాఠశాలలు బీజేపి ప్రభుత్వము ఏర్పాటు చేసింది.. 50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు ఇళ్లనూ మంజూరు చేశామన్నారు. 1 కోటి మంది గిరిజన రైతులకు ప్రతీ సంవత్సరం 6 వేలు ఇస్తుంది, దాన్ని 12 వేలకు పెంచుతామని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరిని పునరుద్ధరిస్తామని అమిత్ షా చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ను తొలగించాలి అనుకుంటే కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేయండని తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు పనులలో, మియాపూర్ భూముల్లో కేసీఆర్ అవినీతి ఉందని అమిత్ షా ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం జనవరిలో ప్రారంభం కానుందని.. అయోధ్యలో రామ మందిర దర్శనంకు ఖర్చు మొత్తం బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు.
Bandi Ramesh: చేసిన అభివృద్ధి ఏంటి?.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన బండి రమేష్
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!