సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. థర్మోగ్రూలేషన్, హార్మోన్ల పనితీరు, బరువు నిర్వహణ దీని ముఖ్యమైన విధులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ పనిచేయకపోవటంతో బాధపడుతున్నారు. చాలామందికి దీని గురించి తెలియదు. ప్రజలు థైరాయిడ్ వ్యాధితో సాధారణ లక్షణాలను మొదట లింక్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది మానసిక కల్లోలం, జ్ఞాపకశక్తి సమస్య, బరువు పెరుగుట లేదా అలసటతో బాధపడుతున్నారు. వీటన్నింటిని వారు వ్యక్తిగతంగా సమస్యగా చూస్తారు. అయితే.. థైరాయిడ్తో బాధపడేవారు ఇంటి వద్ద…
కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. అనంతరం.. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్ను కోరారు. కాగా.. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా నాని? అని…
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ భారత పర్యటన కోసం ఇంగ్లాండ్ A (ఇంగ్లండ్ లయన్స్) జట్టులో చేరనున్నాడు. అతను 9 రోజుల పాటు జట్టులో చేరి ఇంగ్లండ్ లయన్స్ సన్నాహాల్లో సహాయం చేస్తాడు. కార్తీక్ బ్యాటింగ్ సలహాదారుగా చేరనున్నాడు. భారతీయ పరిస్థితులకు సంబంధించి సలహాలు ఇవ్వనున్నాడు.
దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్కు ముందు ఇదే చివరి టీ20 సిరీస్. అఫ్గానిస్థాన్తో తొలి టీ20…
రేపటి (జనవరి 11) నుంచి ఆఫ్ఘనిస్థాన్తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. జట్టులోకి వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. రిషబ్ పంత్ ప్రస్తావన తీసుకొచ్చారు సునీల్ గవాస్కర్. అతను ఒంటికాలిపై నిలబడగలిగినప్పటికీ.. 2024 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులోకి రావాలని గవాస్కర్ తెలిపాడు. ఎందుకంటే అతను ప్రతి ఫార్మాట్లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తాడు.
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. లామిచానే.. నేపాల్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ గా వ్యవహరించగా, ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. మీడియా కథనాల ప్రకారం.. అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు బుధవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
సీఎం జగన్ తో సమావేశంలో మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసని చెప్పారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు. మరోవైపు.. ఈ నెలలో కర్నూల్ లో రూ. 2,500 కోట్లతో అల్ట్రా…
ట్రాఫిక్ నిబంధనలలో (హిట్ అండ్ రన్ లా) కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు నిరసనగా పంజాబ్ లోని కోట్కాపురాలో ఓ ట్రక్కు డ్రైవర్ 250 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కాడు. సుమారు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ సాయంతో పోలీసులు అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘగన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ షంషేర్సింగ్ షెర్గిల్..…
దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితులను…
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.