Punjab: ‘హిట్ అండ్ రన్ లా’ వ్యతిరేకంగా టవర్ ఎక్కిన ట్రక్ డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ నిబంధనలలో (హిట్ అండ్ రన్ లా) కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు నిరసనగా పంజాబ్ లోని కోట్కాపురాలో ఓ ట్రక్కు డ్రైవర్ 250 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కాడు. సుమారు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ సాయంతో పోలీసులు అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘగన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ షంషేర్సింగ్ షెర్గిల్.. పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతన్ని టవర్ పై దించేందుకు ప్రయత్నించగా అది కుదరలేదు.
Shiv Sena: ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకి షాకిచ్చిన స్పీకర్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. అతడి ఫోన్ నెంబర్ ను కనుగొన్నారు. దాంతో.. కుల్విందర్ సింగ్కు కాల్ చేయగా.. అతను ట్రక్ డ్రైవర్ అని, తన నెల జీతం పదివేలు మాత్రమే అని చెప్పాడు. ఈ జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నానని.. ఏదైనా కారణాల వల్ల ఏదైనా సంఘటన జరిగితే, అతను ట్రాఫిక్కు సంబంధించి రూపొందించిన కొత్త నిబంధనలలో సూచించిన జరిమానాను ఎలా చెల్లించాలని పోలీసులకు చెప్పాడు. అయితే.. పోలీసులు అతడిని కిందకు దించాలని ఎంత విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. ఒకవేళ బలవంతం చేసే ప్రయత్నం చేస్తే పైనుంచి దూకేస్తానని ట్రక్ డ్రైవర్ చెప్పాడు.
Delhi Crime: ఢిల్లీలో పెట్రేగిపోతున్న కత్తిపోట్ల ఘటనలు.. ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో దాడి
దీంతో అతడిని ఒప్పించేందుకు ఓ జర్నలిస్టు హెల్ప్ తీసుకుని టవర్ ఎక్కించారు పోలీసులు. అయితే అతను ఎక్కడం చూసిన కుల్విందర్ సింగ్ కిందకు దూకేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే జర్నలిస్ట్ సౌమ్యంగా మాట్లాడి, పోలీసులతో మాట్లాడేలా చేస్తానని అన్నారు. అతన్ని కిందికి రమ్మని ఒప్పించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. వరీందర్పాల్ కూడా ఈ నాలుగు గంటలపాటు టవర్ పైనే ఉన్నాడు. చివరకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో డ్రైవర్ కుల్విందర్ సింగ్తో కలిసి వరీందర్పాల్ సింగ్ కిందకు దిగాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై డీఎస్పీ షంషేర్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. వైద్య పరీక్షల అనంతరం కుల్విందర్ సింగ్ను విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!