Punjab: ‘హిట్ అండ్ రన్ లా’ వ్యతిరేకంగా టవర్ ఎక్కిన ట్రక్ డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ నిబంధనలలో (హిట్ అండ్ రన్ లా) కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు నిరసనగా పంజాబ్ లోని కోట్కాపురాలో ఓ ట్రక్కు డ్రైవర్ 250 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కాడు. సుమారు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ సాయంతో పోలీసులు అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘగన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ షంషేర్సింగ్ షెర్గిల్.. పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతన్ని టవర్ పై దించేందుకు ప్రయత్నించగా అది కుదరలేదు.
Shiv Sena: ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకి షాకిచ్చిన స్పీకర్..
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. అతడి ఫోన్ నెంబర్ ను కనుగొన్నారు. దాంతో.. కుల్విందర్ సింగ్కు కాల్ చేయగా.. అతను ట్రక్ డ్రైవర్ అని, తన నెల జీతం పదివేలు మాత్రమే అని చెప్పాడు. ఈ జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నానని.. ఏదైనా కారణాల వల్ల ఏదైనా సంఘటన జరిగితే, అతను ట్రాఫిక్కు సంబంధించి రూపొందించిన కొత్త నిబంధనలలో సూచించిన జరిమానాను ఎలా చెల్లించాలని పోలీసులకు చెప్పాడు. అయితే.. పోలీసులు అతడిని కిందకు దించాలని ఎంత విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. ఒకవేళ బలవంతం చేసే ప్రయత్నం చేస్తే పైనుంచి దూకేస్తానని ట్రక్ డ్రైవర్ చెప్పాడు.
Delhi Crime: ఢిల్లీలో పెట్రేగిపోతున్న కత్తిపోట్ల ఘటనలు.. ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో దాడి
దీంతో అతడిని ఒప్పించేందుకు ఓ జర్నలిస్టు హెల్ప్ తీసుకుని టవర్ ఎక్కించారు పోలీసులు. అయితే అతను ఎక్కడం చూసిన కుల్విందర్ సింగ్ కిందకు దూకేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే జర్నలిస్ట్ సౌమ్యంగా మాట్లాడి, పోలీసులతో మాట్లాడేలా చేస్తానని అన్నారు. అతన్ని కిందికి రమ్మని ఒప్పించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. వరీందర్పాల్ కూడా ఈ నాలుగు గంటలపాటు టవర్ పైనే ఉన్నాడు. చివరకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో డ్రైవర్ కుల్విందర్ సింగ్తో కలిసి వరీందర్పాల్ సింగ్ కిందకు దిగాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై డీఎస్పీ షంషేర్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. వైద్య పరీక్షల అనంతరం కుల్విందర్ సింగ్ను విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!