Delhi Crime: ఢిల్లీలో పెట్రేగిపోతున్న కత్తిపోట్ల ఘటనలు.. ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో ముగ్గురు నిందితులు మైనర్లు ఉన్నారన్నారు.
Atrocious: ఏపీలో దారుణం.. రెండు నెలలుగా బాలికపై వృద్ధుడు అత్యాచారం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ హత్య ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా.. హత్యకు గురైన వ్యక్తిని గౌరవ్గా గుర్తించారు. అయితే నిందితులు, వ్యక్తి మధ్య ఏదో అంశంపై వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత అందరూ కలిసి గౌరవ్పై దాడి చేశారు. అనంతరం కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..
కాగా.. ఈ ఘటన అనంతరం ముగ్గురు నిందితులను అక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని అర్మాన్ అలియాస్ కురుగా గుర్తించగా, ఇద్దరు 17, 16 ఏళ్ల వయసున్న మైనర్లుగా తేలింది. మరో ఇద్దరు నిందితులు గౌతంపురి మైనర్ నివాసి కాగా, మరొకరు షాహిద్ గా గుర్తించి వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు చేపట్టారు.
- Tags
- arrest
- Crime News
- Delhi
- murder
- police
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!