Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న రోహిత్.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్కు ముందు ఇదే చివరి టీ20 సిరీస్. అఫ్గానిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
Sunil Gavaskar: నేను సెలెక్టర్ అయితే.. అతని పేరును నంబర్ వన్ స్థానంలో ఉంచుతాను
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
రేపు మొహాలీలో జరిగే మొదటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడడని ద్రవిడ్ చెప్పాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20 ఆడకూడదని విరాట్ నిర్ణయించుకున్నట్లు కోచ్ తెలిపాడు. అతను రెండో, మూడో టీ20కి అందుబాటులో ఉంటాడు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ల జోడీ టీమిండియాకు ఓపెనింగ్ అని ద్రవిడ్ చెప్పాడు. ఓపెనింగ్ జోడీ రోహిత్, యశస్విల నుండి టీమ్ మేనేజ్మెంట్ వారిద్దరినీ వరల్డ్ కప్ ప్లాన్లలో చేర్చుతోందని.. ప్రస్తుతం శుభమాన్ గిల్ ప్లాన్లో లేరని స్పష్టమైంది. ఈ ఫార్మాట్లో శుభమాన్ ఫామ్ కూడా ఇటీవల పేలవంగా ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో అతను ప్రదర్శన చూపించలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తొలిసారిగా రోహిత్, యశస్వి ఓపెనర్లు కానున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ టెస్టుల్లో ముఖ్యమైన భాగస్వామ్యాలు ఆడారు.
Ram Temple: 2100 కిలోల గంట, 108 అడుగుల అగర్బత్తి.. దేశవిదేశాల నుంచి శ్రీరాముడి చెంతకు కానుకలు..
కాగా.. భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జనవరి 11న మొహాలీలో తొలి టీ20, జనవరి 14న ఇండోర్లో రెండో టీ20, జనవరి 17న బెంగళూరులో మూడో టీ20 జరగనుంది. టీ20 ప్రపంచ కప్ 2024కి ముందు ఇండియా కేవలం ఒక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ను మాత్రమే ఆడనుంది. అందువల్ల ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన, ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ద్రవిడ్ తెలిపాడు. మరోవైపు.. 2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ జూన్ 1 నుంచి 29 వరకు 20 జట్ల మధ్య జరుగుతుంది. జూన్ 1న కెనడా, అమెరికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా, ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ మైదానంలో జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!