Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్హామ్లో జరిగిన తొలి మ్యాచ్లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఏడో స్థానానికి దూసుకెళ్లారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 287 వన్డే మ్యాచ్ల్లో 48.78 సగటుతో 11,757 పరుగులు ఉన్నాయి. ఇందులో 33 శతకాలు, 62 అర్ధశతకాలు ఉన్నాయి. 2007 లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు.
పాకిస్థాన్ దిగ్గజం ఇంజమామ్-ఉల్-హక్ 378 వన్డేలలో 39.52 సగటుతో 11,739 పరుగులు చేసి ఎనిమిదో స్థానానికి పడిపోయారు. ఆయన వన్డే కెరీర్లో 10 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులతో (49 శతకాలు, 96 అర్ధశతకాలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 312 వన్డేలలో 58.50 అద్భుతమైన సగటుతో 14,802 పరుగులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో 50 శతకాలు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించారు.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఈ జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర (14,234 పరుగులు) ఉండగా, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (13,704 పరుగులు) ఉన్నారు. ఆ తర్వాత ఐదు, ఆరు స్థానాల్లో శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య (13,430 పరుగులు), మహేల జయవర్ధనే (12,650 పరుగులు) కొనసాగుతున్నారు. తాజా మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన ఈ ఘనతతో వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-7 ఆటగాళ్లలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నట్లయింది.
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!