Rajesh Veeramalla
Author- NTV Telugu-
BRS: మరో రెండు ఎంపీ స్థానాలు ప్రకటించిన బీఆర్ఎస్..
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. -
Women’s Day Awards: మహిళా దినోత్సవం పురస్కారాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 19 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. తానిపర్తి చికిత (ఆటలు), కుడుముల లోకేశ్వరి (ఆటలు), ముక్తేవి భారతి (సాహితి), దివనపల్లి వీణా వాణి, ఎస్ జబీన్ (లిటరేచర్-ఉర్దు), బండ సరోజన (ఎడ్యూకేషన్-కరికులం), బిన కేశవరావు (హ్యాండి క్రాఫ్ట్), గుర్రాల సరోజ (సోషల్ సర్వీస్), జమీల నిషత్ (సోషల్ సర్వీస్), అరిపిన జయలక్ష్మి (స్పెషల్ కేటగిరి), దయ్యాల భాగ్య (డాన్స్-ఫిజికల్ ఛాలెంజ్), ప్రొఫెసర్ అరుణ భిక్షు (కూచిపుడి నృత్యం) అవార్డులకు ఎంపిక చేసింది. -
Uttam Kumar Reddy: ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇళ్ల నిర్మాణం చేస్తాం..
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. రేషన్… -
Laxman: అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారు..
తెలంగాణకు బీజేపీ ఏమీ చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టబోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ది మీద, అవినీతి మీద చర్చ లేదు.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు విపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మరక లేకుండా మోడీ పాలన చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 15 రోజులుగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అభివృద్ధి… -
TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..
గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. -
Malla Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీమంత్రి కీలక ప్రకటన
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు. -
konda vishweshwar reddy: చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది..
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా… -
Cabinet Sub Committee: కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. పలు జీవోల సమస్యలపై అధ్యయనం
సాయంత్రం 5 గంటలకు ఎంప్లాయిస్ అసోసియేషన్తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. జీవో 317, జీవో 46కు సంబంధించిన సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇటీవల MCRHRDలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో 317, 46 జీవోలపై అధ్యానం చేయాలని సూచించారు. ఈ క్రమంలో.. దానికి సంబంధించిన సిఫార్సులతో కేబినెట్ సబ్ కమిటీతో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు సూచించారు. -
Minister Seethakka: రవీంద్ర భారతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. స్టెప్పులేసిన మంత్రి
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు. -
Ponnam Prabhakar: రేపటి నుండి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!