Rajesh Veeramalla
Author- NTV Telugu-
Rahul Gandhi: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ..?
రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా.. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు. -
Anna Hazare: “ఈడీ” వెంటపడుతున్న వారిని ఎన్నుకోవద్దు.. కేజ్రీవాల్పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం అన్నా హజారే ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. Raghunandan Rao: […] -
Bomb Threat: ‘అమాయకుల రక్తం చిందిస్తాం’.. బెంగళూరులోని 6 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం బెంగళూరులోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఆ ఆసుపత్రుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్లు, బాంబ్ డిస్పోజల్ టీమ్లతో భారీ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. అయితే.. ఈ ఆసుపత్రుల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇది నకిలీ బెదిరింపు అని.. ఆదివారం ఆసుపత్రులకు పంపిన ఈ-మెయిల్లో దావా చేయబడిందని పేర్కొన్నారు. ఈ-మెయిల్లో.. "నేను మీ భవనంలో పేలుడు పరికరాలను ఉంచాను. మరికొన్ని గంటల్లో అవి… -
PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది
బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత 'అబ్కీ బార్, 400 పార్' నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. -
RCB vs DC: ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.?
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 47 పరుగుల తేడాలో బెంగళూరు గెలుపొందింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. వికెట్ సాధించడంలో విజయం సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. ఢిల్లీ బ్యాటింగ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ (57) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత షాయ్… -
AP Elections 2024: డబ్బుల పంపిణీ విషయంలో ఘర్షణ.. జనసేన నాయకుడి వేలు కొరికిన టీడీపీ నాయకుడు
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. -
RCB vs DC: ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యం.. ఆర్సీబీ స్కోరు 187
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు. -
Sanju Samson: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం.. ఓటమికి కారణమదే..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా.. ఈ ఐపీఎల్లో రాజస్థాన్కు ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ ఈ ఓటమితో ప్లేఆఫ్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాజస్థాన్కు మరో… -
AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని, అటు వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి […] -
AP Weather: ఏపీలో జరిగే పోలింగ్ పై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..
ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!