PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత ‘అబ్కీ బార్, 400 పార్’ నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?
Also Read
ఎన్డిఎ వంటి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నారని, దేశ భవిష్యత్తును భద్రపరిచేందుకు వేడిగాలులు వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీజేపీ 400 సీట్లు దాటదని విపక్షాలు చెబుతున్నాయని.. ఈసారి నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడరని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. దీన్ని రెండు భాగాలుగా చేయడానికి ప్రయత్నించండి అని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీ 400 సీట్ల బెంచ్మార్క్ని సెట్ చేసుకుందని.. 399 సీట్లు, 398 సీట్లు వస్తాయని ప్రతిపక్షం ఆలోచించాలని పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
మరోవైపు.. 2014, 2019 ఎన్నికల వీడియోలను బయటకు తీయాలని ప్రధాని మోడీ తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను చూడండి.. నేను చేసిన ఆరోపణలన్నీ కరెక్ట్ అని రుజువయ్యాయని ప్రధాని మోడీ చెప్పారు. నేను చెప్పాను.. రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పారిపోయి వేరే సీటు కోసం చూస్తాడని.. నేను చేసిన ఆరోపణలన్నీ సరైనవని నిరూపించబడ్డాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ హయాంలో దేశం అత్యధిక ద్రవ్యోల్బణ రేటును చూసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను జాబితా చేస్తూ.. నేడు 1.5-2.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయని.. వాటిలో అత్యధికం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!