ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు.
భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై సభలో జరిగిన చర్చకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. పొరుగు దేశాల కంటే భారతదేశంలో రైలు ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలను ప్రస్తావించారు.
భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు ఖాతాను చాలా మంది వినియోగదారులు వాడుతున్నారు. అయితే ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ఒక ముఖ్య గమనిక.. SBI Yono App మొబైల్ బ్యాంకింగ్ యాప్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. అయితే ఇకపై ఒక ముఖ్యమైన మార్పుతో రానుంది. SBI Yono App త్వరలో ఆండ్రాయిడ్ 11 (Android 11), పాత వెర్షన్లను ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో పని చేయదు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2020-ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం విజయవంతంగా నడుస్తుంది. మంగళవారం (18)వ తేదీన రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా బేగంపేటలో 2వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక Arora Banquets, ఫస్ట్ ఫ్లోర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్, బేగంపేటలో సెలబ్రేషన్స్ చేయనున్నారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి ఆమె మృతదేహాన్ని వీధిలో వదిలివెళ్లాడు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.