Kishan Reddy: నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి..
- సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
- రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు- కిషన్ రెడ్డి
- అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు- కిషన్ రెడ్డి
- అప్పుల్లో కేసీఆర్ కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు పోటీ పడుతున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు.. కేసీఆర్కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: Nithiin : పవన్ కళ్యాణ్ ను కలవబోతున్న నితిన్.. ఎందుకోసమంటే..?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కేసీఆర్ ను మించి అప్పులు చేయడంలో, బూతులు మాట్లాడటంలో సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ మీ ద్వారా తెలంగాణకు ఏమీ ఒరిగిందో ప్రజలకు చెప్పాలని కోరారు. లిక్కర్ ధరల్లో, ఇసుక దందాలో మార్పు వచ్చిందా ప్రజలకు చెప్పాలని అన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయవద్దని జీవో ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కుట్ర బయట పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలానే ఇచ్చాడు.. నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నెల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు చేయలేదు.. మీ మేనిఫెస్టోపై ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డిని కోరారు.
Read Also: MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!