Kishan Reddy: నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి..
- సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
- రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు- కిషన్ రెడ్డి
- అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు- కిషన్ రెడ్డి
- అప్పుల్లో కేసీఆర్ కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు పోటీ పడుతున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు.. కేసీఆర్కి నేనేమీ తక్కువ కాదు అన్నట్లు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: Nithiin : పవన్ కళ్యాణ్ ను కలవబోతున్న నితిన్.. ఎందుకోసమంటే..?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కేసీఆర్ ను మించి అప్పులు చేయడంలో, బూతులు మాట్లాడటంలో సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ మీ ద్వారా తెలంగాణకు ఏమీ ఒరిగిందో ప్రజలకు చెప్పాలని కోరారు. లిక్కర్ ధరల్లో, ఇసుక దందాలో మార్పు వచ్చిందా ప్రజలకు చెప్పాలని అన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయవద్దని జీవో ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కుట్ర బయట పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలానే ఇచ్చాడు.. నీ వల్ల ఏం మార్పు వచ్చిందో చెప్పాలి రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నెల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు చేయలేదు.. మీ మేనిఫెస్టోపై ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డిని కోరారు.
Read Also: MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!