Bijapur: 19 మంది మావోలు లొంగుబాటు.. 9 మందిపై రూ.28 లక్షల రివార్డ్
- బీజాపూర్లో 19 మంది నక్సలైట్లు లొంగుబాటు
- 9 మందిపై రూ. 28 లక్షల రివార్డు
- పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగుబాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు. వారు తమ మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ చెందడం, సీనియర్ క్యాడర్లు అమాయక గిరిజనులను దోపిడీ చేయడం, నిషేధిత సంస్థలో పెరుగుతున్న విభేదాల కారణంగా వారు లొంగిపోయినట్లు చెప్పారు. కాగా.. ఈ విషయాన్ని బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ ఆంధ్ర ఒడిశా బోర్డర్ (AOB) డివిజన్, మావోయిస్టుల పామెడ్ ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో ఉన్నారని యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
లొంగిపోయిన నక్సలైట్లలో దేవ పదం (30), అతని భార్య దులే కలాము (28) మావోయిస్టు బెటాలియన్ నంబర్ 1లో సీనియర్ సభ్యులుగా ఉంది. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. ఇక, ఏరియా కమిటీ సభ్యుడు సురేష్ కట్టం (21) తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. అలాగే లొంగిపోయిన నక్సలైట్లలో ఒక్కో తలపై రూ. 2 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు నక్సలైట్ల తలపై ఒక్కొక్కరికి రూ. 1 లక్ష రివార్డు ఉంది.
Read Also: Tollywood: హీరోలు అందరూ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా?
కాగా.. నక్సలైట్లు లొంగిపోవడంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CRPF, COBRA (కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్) కీలక పాత్ర పోషించాయని జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన ప్రతి నక్సలైటుకూ రూ. 25,000 సహాయం అందించామని అన్నారు. వారికి పునరావాసం కల్పిస్తామని జితేంద్ర కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు బస్తర్ రేంజ్లోని బీజాపూర్ జిల్లాలో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. గత సంవత్సరం, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాలలో మొత్తం 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!