Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Railway Fares In India Are Lower Than Those In Pakistan And Sri Lanka

Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..

Published Date :March 17, 2025 , 6:38 pm
By Rajesh Veeramalla
  • భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువ
  • రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో చర్చ
  • పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలు 10-15 శాతం ఎక్కువ.
Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై సభలో జరిగిన చర్చకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. పొరుగు దేశాల కంటే భారతదేశంలో రైలు ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలను ప్రస్తావించారు. అక్కడ రైల్వే ఛార్జీలు భారతదేశం కంటే 10-15 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

రైల్వే మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలు తమ ప్రయాణీకులకు అతి తక్కువ ధరలకు సురక్షితమైన, నాణ్యమైన సౌకర్యాలను అందించడానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. మరోవైపు.. విద్యుదీకరణ కారణంగా రైల్వేలు ప్రయోజనాలను పెంచుకొని.. ప్రయాణీకుల సంఖ్య, సరుకు రవాణా పెరిగినా.. ఇంధన ఖర్చులు స్థిరంగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణపై బిజెపి ఎంపీలు ప్రశంసలు కురిపించారు. రైల్వే స్టేషన్లు ఇప్పుడు విమానాశ్రయాల మాదిరిగా మారాయని అన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారాయని.. దేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. బుల్లెట్ రైలు కల కూడా త్వరలో సాకారం అవుతుందని ఆయన అన్నారు. హైడ్రోజన్ శక్తితో రైళ్లను నడపడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ తెలిపారు.

Read Also: GVMC Mayor Post: వైసీపీకి బిగ్ షాక్‌..! గ్రేటర్‌ విశాఖ పీఠంపై కూటమి గురి..

అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై మాట్లాడుతూ.. తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతపై శ్రద్ధ వహించాలని దురై తెలిపారు. రాత్రిపూట రైళ్లలో టిటిఆర్, పోలీస్, భద్రతా సిబ్బంది ఉండాలని ఆయన సూచించారు. చర్చలో పాల్గొన్న బిజెపి సభ్యుడు మిథిలేష్ కుమార్ మాట్లాడుతూ.. సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయించిన నిధులు ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించడంలో.. ప్రయాణీకుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలో సహాయపడతాయని అన్నారు. ఎంపీ నరహరి అమీన్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో రైల్వే బడ్జెట్ దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. గత పదేళ్లలో 34 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు వేశామని.. ఇది జర్మనీలో వేసిన మొత్తం రైల్వే లైన్ల సంఖ్య కంటే ఎక్కువని ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో 45 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లను విద్యుదీకరించామని.. 12 నగరాల్లో మెట్రో రైలు సేవలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.

గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయని, కానీ ఈశాన్య రాష్ట్రాల గురించి ఎవరూ ఆలోచించలేదని బిజెపికి చెందిన రాజీవ్ భట్టాచార్య అన్నారు. 2016లో అగర్తలాను బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌తో అనుసంధానించే పని తొలిసారిగా ప్రారంభించబడిందని ఆయన అన్నారు. చర్చలో పాల్గొన్న బిజెపికి చెందిన రామేశ్వర్ తేలి మాట్లాడుతూ.. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన రైల్వే ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ప్రమాదాల సంఖ్య నిరంతరం తగ్గుతోందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwini Vaishnav‌
  • Indian Railways
  • Pakistan
  • Rail Transport
  • Railway Fare Comparison

తాజావార్తలు

  • Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions