NTV WebDesk
Author- NTV Telugu-
కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం కీలక నిర్ణయం…గెజిట్లు విడుదల…
తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వినియోగానికి సంబందించిన సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ గెజిట్లను విడుదల చేసింది కేంద్రం. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానున్నది. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం పేర్కొన్నది. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను ఈ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చింది. Read: ఎన్టీఆర్ పాపులర్ […] -
దీర్ఘకాలిక కోవిడ్ తో జరా జాగ్రత్త…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా బారిన పడిన రోగులపై బ్రిటన్ కు చెందిన యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా బారిన పడిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కోవిడ్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. బ్రెయిన్ ఫాగ్ నుంచి చెవిలో మోత వరకు అనేక సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో సుమారు 200 రకాల సమస్యలను గుర్తించినట్టు యూనివర్శిటి ఆఫ్ లండన్ […] -
కొనుగోలు దారులకు షాక్: భారీగా పెరిగిన పుత్తడి ధరలు…
కరోనా తరువాత మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం కోనుగోలు చేసే వినియోగదారులు పెరిగారు. బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ధరలు పెరగడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది. ఇక బంగారంతో […] -
జులై 16, శుక్రవారం దినఫలాలు
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే […] -
కేంద్రంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు…
కేంద్ర తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపేర్కొన్నారు. దేశంలో ఇప్పటి విపత్కర పరిస్థితులకు ఎవరు కారణమో అందరికీ తెలుసునని అన్నారు. దశాబ్ధాలుగా నిర్మించిన వాటిని కొన్ని సెకన్ల వ్యవధిలో కూల్చివేశారని విమర్శలు చేశారు. ఎల్ఒసీ, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వివాదాలు, నిత్యవసర ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, కరోనా వ్యాక్సిన్ల కొరత తదితర అంశాలకు కారణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే అని అన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల […] -
సిద్దూ చేతికి పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు…
పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిద్దూ అనతి కాలంలోనే పార్టీలో మంచి పట్టు సాధించారు. అయితే, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, సిద్దూ వర్గంగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ఈ తగాదాలు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్దూకి కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ముఖ్యమంత్రిగా అమరిందర్ సింగ్ కొనసాగనున్నారు. దీంతో పంజాబ్లో గొడవకు […] -
వారణాసిలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు…
ప్రధాని మోడీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలను, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. వారణాసి నగరంలో రూ.1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడి ప్రసంగించారు. చాలా రోజుల తరువాత వారణాసి ప్రజలను కలుసుకునే అవకాశం వచ్చిందని, కాశీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కాశీవిశ్వేశ్వరుడి ఆశీర్వాదంతోనే జరుగుతుందని అన్నారు. దేశంలో పెద్దరాష్ట్రమైన యూపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు జరిగినట్టు ప్రధాని మోడి తెలిపారు. దేశంలో ప్రస్తుతం […] -
దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…
దేశంలో గత కొన్ని రోజులుగా దేశద్రోహం చట్టం పేరు బాగా వినిపిస్తున్నది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించే సమయంలో కోర్టు ఈ రకంగా స్పందించింది. Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే […] -
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన: 111 దేశాల్లో డెల్టా వేరియంట్… కట్టడి చేయకుంటే..
కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ డెల్టావేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని 111 దేశాల్లో డెల్టావేరియంట్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ఆల్ఫా, బీటా రకం వేరియంట్లు ఎక్కవ దేశాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపడం లేదని, కానీ, డెల్టావేరియంట్ ప్రమాదకరమైన వేరియంట్గా మారిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టంచేసింది. వైరస్కు కట్టడి చేయాలని, కరోనా నిబంధనలు, వ్యాక్సిన్లు వేగవంతంగా అమలు చేయడం ఒక్కటే పరిష్కారమని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుంటే మరిన్ని వేరియంట్లు […] -
డీఆర్డీవో నూతన ఆవిష్కరణః డ్రోన్ ఆటలకు చెక్ పెట్టేందుకు…
గత కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్లు రహస్యంగా భారత్ భూభాగంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. జమ్మూకాశ్మీర్లోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తరువాత, భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ నిత్యం జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోనులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ డ్రోన్లకు చెక్ పెట్టేందుకు డీఆర్డీఓ రంగంలోకి దిగింది. Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..? […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?