NTV WebDesk
Author- NTV Telugu-
తాలిబన్లకు కాందహార్ కీలకం… ఎందుకంటే…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా […] -
బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్మ్యాప్ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో […] -
యాంటీ వ్యాక్స్ నర్సు నిర్వాకం: కోవిడ్ వ్యాక్సిన్కు బదులుగా సెలైన్ ద్రావణం…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచం మొత్తం ఘోషిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆర్ధిక స్తోమతను బట్టి వివిధ దేశాలు వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్ను విమర్శించేవారు, వ్యాక్సిన్పై నమ్మకం లేనివారు కూడా కోకొల్లుగా ఉన్నారు. అలాంటి వారిలో ఓ జర్మన్ నర్సు కూడా ఉన్నది. బ్రెజిల్ లోని ఉత్తర సముద్రతీరంలోని ప్రైస్ల్యాండ్ ప్రాంతంలోని ఓ టీకా కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళ… 8600 మందికి వ్యాక్సిన్ కు బదులుగా సెలైన్ ద్రావణాన్ని […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ […] -
డ్రాగన్ దేశంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్…పూహాన్ తరహాలో ఇళ్లకు తాళాలు…
డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2019లో వూహన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా మహమ్మారి సమయంలో వూహన్లో అప్పట్లో కఠినమైన నిబంధనలు అమలుచేశారు. కరోనా సోకిన వారికి ఇళ్లలో ఉంచి బయట తాళాలు వేశారు. ఐరన్ బార్స్తో తలుపులు తెరుచుకోకుండా చేశారు. కరోనా నుంచి కొలుకునే వరకు ఇంటి నుంచి ఎవర్నీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డెల్టావేరియంట్ ఆ […] -
భారీ వర్షాలతో చైనా కకావికలం…21 మంది మృతి…
ప్రపంచాన్ని ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు భారీ వర్షాలు, వరదలు భయానకం సృష్టిస్తున్నాయి. చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 21 మంది మృతి చెందినట్టు చైనా అధికారులు ప్రకటించారు. హుబే ప్రావిన్స్లోని 5 నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టించాయి. యుచెంగ్ నగరలంలో ఎప్పుడూలేని విధంగా 400 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హుబే ప్రావిన్స్లోని 774 రిజర్వాయర్లు వరదనీటితో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. ఆగకుండా వరద వస్తుండటంతో […] -
40 ఏళ్ళనాటి కేకు… భారీ ధరకు అమ్మకం…
మాములుగా కేకు ధరలు అందులో వినియోగించే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఎంత ఖరీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజులకు మించి ఉండదు. కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది. పైగా రాజకుటుంబం పెళ్లి సమయంలో కట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. 1981 జులై 29 వ తేదీన బ్రిటన్ యువరాజు చార్లెస్-డయానాలు పెళ్లిజరిగిన రోజు. ఆ రోజున ఈ కేకును కట్ చేసి అందరికి పంచారు. […] -
తాలిబన్లతో సంధికి ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు…
తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్నది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు […] -
సోనియా గాంధీ నేతృత్వంలో త్వరలో ప్రతిపక్షాల సమావేశం…
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ధరల పెరుగుదల, […] -
భూమికి బెన్ను ముప్పు…2300 నాటికి…
భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. దీని వలన భూమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించింది. అదే ఏడాది నాసా ఒసైరిస్ రెక్స్ అనే వ్యోమనౌకను ఆ గ్రహశకలం మీదకు పంపింది. నాలుగేళ్లపాటు ప్రయాణం చేసిన […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!