Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలో తిరిగి ల్యాండ్
- ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీలో ల్యాండ్
- ఇంజిన్లో తలెత్తిన సమస్య.. విచారణకు మంత్రిత్వ శాఖ ఆదేశం
ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అయిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
AI 887 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున 3:20 గంటలకు ముంబైకు బయల్దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగరగానే పైలట్లు కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పడిపోయినట్లుగా గమినించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులంతా క్షేమంగా దిగేశారని.. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇంజిన్లో తలెత్తిన వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా భావిస్తున్నారు. ఇక అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ఊహించని రీతిలో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. అయితే దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిరిండియాకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏకు సూచించింది. అలాగే ప్రయాణికులకు అన్ని విధాలా సహాయం అందించాలని.. తదుపరి విమానాల్లో సర్దుబాటు చేయాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
The Ministry of Civil Aviation has taken note of the Air India flight AI-887 incident involving a technical issue shortly after take-off. The aircraft landed safely. The Ministry has sought a detailed report from Air India, and DGCA has been directed to conduct a thorough…
— ANI (@ANI) December 22, 2025
తాజావార్తలు
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!