Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలో తిరిగి ల్యాండ్
- ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీలో ల్యాండ్
- ఇంజిన్లో తలెత్తిన సమస్య.. విచారణకు మంత్రిత్వ శాఖ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అయిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read
- India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
AI 887 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున 3:20 గంటలకు ముంబైకు బయల్దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగరగానే పైలట్లు కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పడిపోయినట్లుగా గమినించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులంతా క్షేమంగా దిగేశారని.. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇంజిన్లో తలెత్తిన వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా భావిస్తున్నారు. ఇక అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ఊహించని రీతిలో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. అయితే దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిరిండియాకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏకు సూచించింది. అలాగే ప్రయాణికులకు అన్ని విధాలా సహాయం అందించాలని.. తదుపరి విమానాల్లో సర్దుబాటు చేయాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
The Ministry of Civil Aviation has taken note of the Air India flight AI-887 incident involving a technical issue shortly after take-off. The aircraft landed safely. The Ministry has sought a detailed report from Air India, and DGCA has been directed to conduct a thorough…
— ANI (@ANI) December 22, 2025
తాజావార్తలు
-
India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!