NTV WebDesk
Author- NTV Telugu-
అసెంబ్లీలో జారిన పంచే… నవ్వు ఆపుకోలేకపోయిన స్పీకర్…
కర్ణాటక అసెంబ్లీలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మైసూర్ అత్యాచార ఘటనపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీరియస్గా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ వచ్చి సిద్ధరామయ్య చెవిలో పంచె ఊడిపోయిందని చెప్పాడు. వెంటనే సిద్ధరామయ్య తన సీట్లో కూర్చుండిపోయి తరువాత మాట్లాడతానని అన్నారు. అయితే, సమస్య ఏంటో చెప్పాలని సిద్ధరామయ్యను స్పీకర్ బంగారప్ప కోరగా, ధోతి బిగించి కట్టుకొని, కరోనా తరువాత నాలుగైదు కేజీల బరువు పెరిగానని, పోట్ట […] -
ఆచంటలో జనసేనతో కుదిరిన దోస్తి… టీడీపీకి ఎంపీపీ…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. […] -
ఇస్లామిక్ చట్టాల ప్రకారమే శిక్షలు… తాలిబన్ల కీలక నిర్ణయం…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన తాలిబన్లు దానిని పక్కన పెట్టేశారు. షరియా చట్టాల ప్రకారమే పాలన ఉంటుందని, పురుషులు చేయలేని పనుల్లో మాత్రమే మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంతేకాదు, విద్య విషయంలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతున్నది. ఇక ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయడానికి ఓ శాఖను ఏర్పాటు చేశారు. చట్లాలను ఏవరైనా ఉల్లంఘిస్తే చేతులు, కాళ్లు నరకడం, బహిరంగంగా ఉరితీయడం వంటివి తిరిగి అమలు […] -
వైరల్: సింహాన్ని బెదరగొట్టిన తాబేలు…
సింహం అడవికి రారాజు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బలమైన జంతువు అయి ఉండాలి. అయితే, ఓ చిన్న తాబేలు అడవికి రాజైన సింహాన్ని బెదిరించింది. తన తలను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో సింహం నాకెందుకులే అన్నట్టుగా పక్కకు జరిగి మళ్లీ నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అయినప్పటికి ఆ తాబేలు ఊరుకోలేదు. సింహం మీదకు మళ్లీ తలను పైకి ఎత్తి అక్కడి నుంచి […] -
తప్పుడు హెయిర్ కట్ ఫలితం: మోడల్కు రూ.2 కోట్ల పరిహారం…
అప్పుడప్పుడే మోడలింగ్ రంగంలో ఎదుగుతున్న అషనా రాయ్, ఓ హోటల్ సిబ్బంది తప్పుడు నిర్ణయం కారణంగా తన మోడలింగ్ రంగానికి దూరమైంది. తన కేశాలతో ఆకట్టుకుంటూ అనేక కేశసంబంధమైన సౌందర్య ఉత్పత్తులకు మోడల్గా నటిస్తున్నది. టాప్ మోడల్గా ఎదగాలన్నది ఆమె కల. అయితే, హోటల్ సిబ్బంది నిర్వాకం కారణంగా ఆమె తలకు దురద, అలర్జీ అంటుకున్నది. ఫలితంగా ఆమె అవకాశాలను కోల్పోయింది. దీంతో మోడల్ అషనా రాయ్ కోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదురాలి వాదనలు విన్న కోర్టు హోటల్ […] -
వంటగ్యాస్కు మళ్లీ సబ్సిడీ ఇవ్వనున్నారా?
వంటగ్యాస్ ధరలు ప్రతినెలా తడిసిమోపెడు అవుతున్నది. అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతుండటంతో గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు గ్యాస్ కు భారీ సబ్సిడీని ఇవ్వడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, పేదలతో పాటుగా ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ సబ్సిడీని వినియోగించుకోవడంతో కేంద్రం సబ్సిడీని ఇవ్వడం నిలిపివేసింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.900 పలుకుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కేంద్రం గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని […] -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రభుత్వం పరిధిలోకి మాంసం దుకాణాలు…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది పశువర్ధక శాఖ. రాష్ట్రంలో కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్లో ఒకటి చొప్పున వధశాలలను ఏర్పాటు చేసివాటిని […] -
ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా… 90శాతం ఆ వేరియంట్ కేసులే…
ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్ అనేక విధాలైన వేరియంట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో ఆల్ఫా, గామా, బీటా, కప్పా వేరియంట్లు ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉండటం విశేషం. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు తీసుకుంటున్నా, ఈ వేరియంట్ కేసులు టీకాలు తీసుకోని వారికి, తీసుకున్న వారికి సోకుతున్నది. 185 […] -
కరోనా ఎఫెక్ట్: నెలరోజులపాటు పడవలోనే ఒంటరిగా ప్రయాణం…
కరోనా కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఇప్పటికీ ఇంకా అనేక దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అటు ఫ్రాన్స్లోనూ కరోనా ఇబ్బందులు పెట్టింది. అత్యవసరంగా ప్రయాణం చేయాలి అనుకున్నా కుదరక ఉన్నచోటనే కోట్లాది మంది ఉండిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోల్డ్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఫ్రెంచ్ […] -
కమలాహారీస్ను భారత్కు ఆహ్వానించిన ప్రధాని…
ప్రధాని మోడి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడి అమెరికాలోని టాప్ కంపెనీలైన క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్స్టోన్ సీఈవోలతో ప్రధాని చర్చలు జరిపారు. అనంతరం వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ప్రధాని మోడి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తో భేటీ అయ్యారు. ఈ బైటీలో రెండు దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో సహకరించినందుకు అమెరికాకు ప్రధాని మోడి కృతజ్ఞతలు తెలిపారు. […]
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!