NTV WebDesk
Author- NTV Telugu-
యూపీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్… హథ్రాస్ ఘటనలోనూ అలానే చేశారు…
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. లఖింపూర్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అటు ప్రతిపక్షాలు సైతం యూపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిన్న యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తాము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, 144 సెక్షన్ […] -
ఏపీ పీసీసీలో కీలక మార్పులు ఉండబోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకునేందుకు పావులు కదుపుతున్నది. తెలంగాణలో పీసీసీలో మార్పులు చేసిన తరువాత దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే, ఏపీలో అందుకు విరుద్ధంగా ఉండటంతో పార్టీలో తిరిగి నూతనోత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ లోని కీలక నేతంతా […] -
మళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెరిగింది. రాయితీ, రాయితేతర గ్యాస్ సిలిండర్ పై రూ.15 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు మరోసారి గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులుపై మరింత భారం పడే అవకాశం ఉన్నది. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ ధర […] -
లఖింపూర్ ఘటన: రాహుల్ కు అనుమతి నిరాకరణ…
లఖింపూర్ ఘటనపై ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. లఖింపూర్ లో కేంద్ర సహాయమంత్రి అయజ్ మిశ్రా కుమారుడు నిర్లక్ష్యం కారణంగా నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహించిన రైతులు కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. లఖింపూర్లోని బాధితులను పరామర్శించేందుకు ఎవర్నీ పోలీసులు అనుమతించడం లేదు. గత రెండు రోజులుగా ప్రియాంక గాంధీ […] -
జనసేనలోకి వలసలు ప్రారంభం కానున్నాయా?
ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. బలం పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్రంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం కావడంతో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తోందని, అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎలాంటి వలసలను ప్రోత్సహించలేదు. కాగా, ఇప్పుడు ఆ పార్టీలోకి వలసలు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. […] -
కోవాగ్జిన్పై ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం… ఎప్పుడంటే…
భారత్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అంశంపై వచ్చే వారం ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం తీసుకోనున్నది. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుపులు వచ్చేవారం సమావేశం కాబోతున్నారు. టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ అందజేసింది. దీనితో పాటుగా సెప్టెంబర్ 27 వ తేదీన అదనపు డేడాను కూడా భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్యకు అందజేసింది. దేశంలో ఇప్పటికే కోవాగ్జిన్ […] -
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం…
తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు […] -
రష్యా సాహసం: అంతరిక్షంలో తొలిసారి సినిమా షూటింగ్…
సాధారణంగా అంతరిక్షంలో జరిగే సన్నివేశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్స్ వేసి లేదంటే గ్రాఫిక్స్లోనూ షూట్ చేస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన చిత్రబృందం ఏకంగా స్పేస్లోనే డైరెక్ట్గా సినిమాను షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ది ఛాలెంజ్ అనే సినిమాలోని 40 నిమిషాల సీన్ కోసం 12 రోజులపాటు అంతరిక్షంలో షూటింగ్ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఈ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ లు రష్యాలోని బైకనూర్ నుంచి సోయిజ్ ఎంఎస్ 19 […] -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి…
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఇంద్రకీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దం […] -
ఆ వెయ్యికోట్లు అమరావతికి వస్తాయా?
కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నది. 15 వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త నరగాలకు రూ.8 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు కేంద్రం కూడా నగరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కూడా. అయితే, ఇప్పుడు ఆ 8 నగరాల్లో అమరావతి కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. సుమారు 217 చ.కిమీ విస్తీర్ణంలో అన్ని రకాల హంగులతో […]
తాజావార్తలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!