NTV WebDesk
Author- NTV Telugu-
ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది…
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను తయారు చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో ఈ పోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను డిజైన్ చేసింది. ఈ మొబైల్ ను ఈరోజు లాంచ్ చేశారు. శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ధర రూ.92 వేల నుంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్ఫోన్ 33 వాట్ సూపర్ ఫ్లాష్ […] -
చట్ట సభలు “తాలింఖానాలు” కావు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య
దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు […] -
రష్యాకు మరో హెచ్చరిక…ఉక్రెయిన్పై దాడికి దిగితే…
రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. 75 వేల మంది బలగాలను రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉక్రెయిన్పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. కాగా, ఇప్పుడు అమెరికా బాటలోనే జర్మనీ కూడా హెచ్చరించింది. జర్మనీ కొత్త ఛాన్సలర్ స్కాల్జ్ కూడా రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చర్యలకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని, రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని […] -
రుణ యాప్ల కేసు: భారీగా ఆస్తులు అటాచ్
తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్లు ఎంతటి దారుణాలకు ఒడిగట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈడీ తన వేగం పెంచింది. రుణ యాప్ ల కేసులో మరో రూ.51కోట్ల ఆస్తులు అటాచ్ చేశాయి. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన రూ.51 కోట్ల అటాచ్ అయ్యాయి. గతంలో పీసీ ఫైనాన్షియల్ కు చెందిన రూ.238 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చింది పీసీఎఫ్ఎస్. చైనాకు […] -
గవర్నర్తో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. గవర్నర్ దంపతుల ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి దంపతులు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలో బాధపడుతున్న గవర్నర్ను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని రోజుల క్రితం బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడ్డారు. హైదారాబాద్లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, పోస్ట్ కరోనా తరువాత మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి హైదరాబాద్లోని ఆసుపత్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక ఏపీ వచ్చారు. […] -
లైఫ్ సైన్సెస్కు కేపిటల్ హైదరాబాద్:కేటీఆర్
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. 265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి […] -
బైక్ని తప్పించబోయి…బస్సు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. బస్సు ప్రమాద ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నాం అన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు 20 మీటర్ల దూరం నుండి అదుపు తప్పింది అంటున్నారు. బస్సులో 47 మంది ఉన్నారు. 9 మంది చనిపోయారు. డ్రైవర్ కి హార్ట్ స్ట్రోక్ అని ప్రచారం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే వాస్తవాలు తెలుస్తాయన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని […] -
సెమీకండక్టర్ చిప్స్ తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్… భారీగా నిధులు కేటాయింపు…
మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. […] -
కేసీఆర్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది.. వివేక్
బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం […] -
ప్రపంచాన్ని కుదిపేస్తున్న తాజా సర్వే… చైనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మొదలైన భయాలు…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్ను తీసుకున్నారు. […]
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!