చట్ట సభలు “తాలింఖానాలు” కావు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు అన్నారు వెంకయ్యనాయుడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే నాకు నిద్ర పట్టడం లేదు. దేశ భవిష్యత్తు పై ఆందోళన కలుగుతోంది. భుజం బలం చూపడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. బుధ్ది బలం తో ఎంతటి శక్తివంతులనైనా ఎదుర్కోవచ్చన్నారు.
Also Read
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!

పార్టీలు బుద్ధి బలం చూపే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమశిక్షణ పాటించాలని కోరితే తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. సభలో మాట్లాడకుండా, బయట మాట్లాడం ఏమిటో అర్దంకావడం లేదు. వారికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడం కూడా శోచనీయం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజం. చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడమే పరిణితి. సభకు సభ్యుల హాజరు కూడా తగ్గిపోవడం విచారకరం అన్నారు. సిద్ధాంతం, సేవాభావం, విలువలు కలిగిన వారిని ప్రోత్సహించాలి. విధ్వంసకర ధోరణులు కలిగిన వారిని ప్రోత్సహించవద్దన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!