బైక్ని తప్పించబోయి…బస్సు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. బస్సు ప్రమాద ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నాం అన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు 20 మీటర్ల దూరం నుండి అదుపు తప్పింది అంటున్నారు. బస్సులో 47 మంది ఉన్నారు. 9 మంది చనిపోయారు. డ్రైవర్ కి హార్ట్ స్ట్రోక్ అని ప్రచారం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే వాస్తవాలు తెలుస్తాయన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఎదురుగా వచ్చిన బైక్ని తప్పించబోయి బస్సు వాగులో పడిపోయింది.
బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలో లారీ బోల్తా పడింది. జల్లేరు వాగుపై అప్పట్లోనే ధ్వంసం వంతెన రైలింగ్ ధ్వంసం అయింది. అయినా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోలేదు. ఆ వంతెన రైలింగ్ ఉండి ఉంటే ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. 12 30 గంటలకు బస్సు ప్రమాదం జరిగిందని, గజ ఈతగాళ్లతో స్పాట్ కి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్టీవీతో చెప్పారు. 8 మంది డెడ్ బాడీలను అప్పటికప్పుడు వెలికితీశామని, క్షతగాత్రులను వెంటనే వాగు నుండి బయటకు తీసుకు వచ్చామన్నారు. బస్సును 3 క్రేన్లతో వెలికి తీశామన్నారు.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
బస్సు కింద ఇంకెవరైన ఉన్నారా అని చెక్ చేశామని, 100 మీటర్ల పరిధి వరకు డైవ్ చేసి చెక్ చేసామన్నారు అగ్నిమాపక అధికారులు. బస్సు కింద ప్రాంతంలో ఇంకెవరు లేరన్నారు. 20 అడుగుల ఎత్తు నుండి జల్లేరు వాగులో బస్సు పడింది. దీంతో పల్లె వెలుగు బస్సు మొత్తం ధ్వంసం అయింది. రక్తం మరకలతో దర్శనం ఇస్తోంది బస్సు. అతి కష్టం మీద మూడు క్రేన్ లతో 4 గంటల పాటు శ్రమించి బస్సును బయటకి తీశారు అధికారులు.
బస్సు బోల్తా పడగానే ప్రాణాలతో బయట పడ్డానని, కళ్ళ ముందే ప్రయాణికులు చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. బస్ షేక్ అవుతూ ముందుకు వెళ్ళింది. ప్రమాద ఘటనకు ముందు బస్సులో వున్న 47మంది అరుస్తూ కేకలు వేశారు. కళ్ళ ముందు ముసలి అవ్వ కాపాడండి అంటూ చనిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!