-
టిక్కెట్ రేట్లు, షోస్ పై స్పందించిన దర్శకేంద్రుడు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శన, టిక్కెట్ రేట్ల పై నియంత్రణ పెట్టడాన్ని ఖండించారు. నాలుగున్నర దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా ఈ రంగంలో ఉన్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు, నిర్మాతలు వీరంతా బాగుంటేనే చిత్రసీమ బాగుంటుందని అన్నారు. టిక్కెట్ రేట్లు తగ్గించడం, షోస్ ను ప్రభుత్వం నిర్ణయించడం వల్ల చాలామంది తీవ్ర నష్టాలకు గురి అవుతారని రాఘవేంద్రరావు అభిప్రాయ పడ్డారు. కామన్ మ్యాన్ కు సినిమా ఒక్కటే వినోద సాధనమని […] -
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ‘సిరివెన్నెల’ కుటుంబం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 24వ తేదీ కిమ్స్ హాస్పిటల్ లో చేరిన ‘సిరివెన్నెల’ సీతా రామశాస్త్రి నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే ఈ సమయంలో హాస్పిటల్ లో వైద్యానికి అయిన ఖర్చులన్నంటినీ ఏపీ ప్రభుత్వం భరిస్తుందని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ […] -
ఏపీ కరోనా : నేడు స్థిరంగా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ప్రతీ రోజూ 100కి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,595 శాంపిల్స్ పరీక్షించగా.. 184 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 183 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,04,46,677 కరోనా నిర్ధారణ పరీక్షలు […] -
ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్రందే…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం గవర్నర్ కి చెప్పాం అని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్రంది అని చెప్పిన ఆయన పంటను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అని అన్నారు.. మెడ మీద కత్తి పెడితే రాష్ట్రాన్ని మోడీకి రసిస్తడా.. కేసీఆర్ అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు అదానీ..అంబానీకి రాష్ట్రాన్ని అమ్మేస్తడా అని అడిగారు. రైతును అయోమయంలోకి నెట్టి… తక్కువ ధరకు అమ్మే పరిస్థితి […] -
సౌత్ ఆఫ్రికా పర్యటనపై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
ఈ నెలలో భారత జట్టు వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటన పై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రస్తుతం ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో అయితే ఈ పర్యటన కొనసాగుతోంది. కానీ […] -
వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు : మంత్రి బొత్స
ప్రజల కోసం మంచి పథకం తీసుకుని వేస్తే టీడీపీ విమర్శలు చేస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇళ్ళ పట్టాలపై కూడా టీడీపీ ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిన్న కోర్టు తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది అని మంత్రి బొత్స తెలిపారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగిందే అని చెప్పిన ఆయన… ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు అని చెప్పారు. స్వచ్ఛందంగా […] -
పాటల తోటమాలి సిరివెన్నెల.. కలకాలం నిలిచిపోయే పాట ముద్ర!!
తెలుగు సినిమాకు పాటే ప్రాణం. చాలా మంది పాటలు రాయగలరు. కానీ, వాటికి ప్రాణం పోసేది మాత్రం కొందరే. అందులో సిరివెన్నెల సుప్రిసిద్ధులు. ఏది రాసినా..అందులోని ఏదో ఒక వాఖ్యం నీలో నిలిచిపోతుంది. మనసు తలుపు తడుతుంది. ఆయన కలం నుంచి జాలువారిన పాట మన నాలుకపై నాట్యమాడుతుంది. సిరివెన్నెల ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు…కానీ ఆయన పంచిన ఆ పాటల వెన్నెల కరిగిపోదు. ఆ సుమధుర గీతాలు నిత్యం ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అందుకే […] -
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా…?
ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ అవకాశం నిన్నటితో 8 జట్లకు ముగిసింది. కొత్తగా వస్తున్న రెండు జట్లకు ఇంకా అవకాశం ఉంది. అయితే ఈ రిటైన్ లో దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్ లను తమతో ఉంచుకున్నాయి. ఒక్క పంజాబ్ కింగ్స్ జట్టు మినహా. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంతో ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆ జట్టు తర్వాతి […] -
వేలంలోకి వెళ్ళాలి అనేది రాహుల్ నిర్ణయం… దానిని గౌరవిస్తాం : కుంబ్లే
ఐపీఎల్ 2022 కోసం తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. అయితే అందులో కొన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను తీసుకోలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ నే వేలంలోకి వదిలింది. దాని పై భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్… ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. మేము అతడిని రిటైన్ చేసుకోవాలని భావించాం. కానీ అతను వేలంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. మేము అతని […] -
అభిమానులకు, మీడియాకు అజిత్ ఆంక్షలు!
తమిళ స్టార్ హీరో అజిత్ ను అభిమానులంతా ముద్దుగా ‘తలా’ అనిపిలుస్తుంటారు. అయితే.. ఇక మీదట తన పేరు ముందు ఎలాంటి ప్రిఫిక్స్ లూ వద్దని చెబుతున్నాడు అజిత్. మక్కల్ తిలకం అని ఎంజీఆర్ ను, నడిగర్ తిలకం అని శివాజీ గణేశన్ ను, సౌతిండియా సూపర్ స్టార్ అని రజనీకాంత్ ను, ఉలగనాయకన్ అని కమల్ హాసన్ ను అభిమానులు సంభోదిస్తుంటారు. అలానే విజయ్ ను దళపతి అని, అజిత్ ను తలా అని సంభోదించడం […]
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!