Supreme Court: ‘ఇండిగో సంక్షోభం’ పిటిషన్పై సుప్రీంకోర్టు ఝలక్
- ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్
- ఎమర్జెన్సీ విచారణకు పిటిషనర్ రిక్వెస్ట్
- అవ్యవసర విచారణకు నిరాకరించిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా… సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో సంక్షోభాన్ని అత్యవసరంగా విచారించలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్రమైన సమస్యేనని.. లక్షలాది మంది బాధితులు ఉన్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Indigo Crisis: డంప్ యార్డ్ల్లా ఎయిర్పోర్టులు.. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ శనివారం పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. తాజాగా అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఏ ఎయిర్పోర్టుల్లో చూసినా ప్రయాణికులు, లగేజీ బ్యాగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని విమానాశ్రయాలు డంప్ యార్డులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా బ్యాగులు కనిపిస్తున్నాయి. కుప్పలు తిప్పలుగా పడిపోయి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు చోరీలు కూడా జరుగుతున్నాయి. తమ వస్తువులు పోయాయంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ ఇచ్చేసింది.
ఇదిలా ఉంటే సోమవారం కూడా దేశ వ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలను రద్దు చేసింది. ఇవాళ 450 విమానాలు రద్దు.. హైదరాబాద్లో 112, ఢిల్లీలో 134, తమిళనాడులో 71, బెంగళూరులో 127 విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు సలహా జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బయల్దేరే ముందు వైబ్సైట్ చూసుకోవాలని.. అసౌకర్యానికి గురి కాకాకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది.
- Tags
- Airports
- country
- Delhi
- Dump yards
- indigo
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!