తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 208 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 201 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,69,163 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,61,294 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3940 కు చేరుకుంది.. […]
రేపు సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అలా ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు. పరీక్ష ల సూపరింటెండెంట్ లు హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం […]
రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు […]
ఏపీలో మరోసారి మినీపోరుకు రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుస ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతోంది. పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీచింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీసం పోటీ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు దాదాపు 80నుంచి 90శాతం స్థానాల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. అయితే అనివార్య కారణాలతో దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,219 శాంపిల్స్ పరీక్షించగా.. 332 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 06 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 651 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,90,16,065 కు […]
ప్రభుత్వంని నడిపించాల్సిన సమయంలో పార్టీ మీద కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం ముందస్తు ఎన్నికలకు పోవడానికే అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు విజయ ఘర్జన సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ మీద పట్టుకోల్పోతున్నాననే భయం ఆయనలో ఉంది. బీజేపీ కూడా కేసీఆర్ కి సహకరించేందుకు హామీ ఇచ్చింది. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ వరస మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. హుజూరా బాద్ ఎన్నికల తరువాత పార్టీలో తిరుగుబాటు […]
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ హుజురాబాద్ ఉప ఎన్నిక పై అదుపు తప్పింది. కోట్లు డబ్బులు పంచుతున్న పట్టించుకోవడం లేదు. హుజురాబాద్ లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మద్యే పోటీ అని చెప్పారు. టీఆరెస్ పార్టీ హుజురాబాద్ లో దసరా పండుగ కు డబ్బులను ఏరులై పారించింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి అసమస్యను ఎత్తి […]
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల […]
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ గా మిస్టర్ డిపెండబుల్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రావిడ్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండటం దాదాపు ఖాయం అయింది. అయితే ఐపీఎల్ 2021 ఫైనల్స్ రోజే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అలాగే సెక్రటరీ జేషా ద్రావిడ్ ను కలిసి హెడ్ కోచ్ భాధ్యతలకు ఒప్పించారు. […]