ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ గా మిస్టర్ డిపెండబుల్ ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రావిడ్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉండటం దాదాపు ఖాయం అయింది. అయితే ఐపీఎల్ 2021 ఫైనల్స్ రోజే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అలాగే సెక్రటరీ జేషా ద్రావిడ్ ను కలిసి హెడ్ కోచ్ భాధ్యతలకు ఒప్పించారు. దాంతో ఇప్పుడు ఆ ఎన్సీఏ హెడ్ పోస్ట్ కాలి కావడంతో ఆ బాధ్యతలు ఎవరికీ అప్పగించాలి అనే దాని పై బీసీసీఐ పరిశోధన చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఎన్సీఏ హెడ్ గా ఉండాలి బీసీసీఐ వీవీఎస్ లక్ష్మణ్ ను సంప్రదించినట్లు సమాచారం. కానీ ఆ బాధ్యతలను స్వీకరించడానికి లక్షణ్ ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. అయితే మొదట భారత తదుపరి హెడ్ కోచ్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు వినిపించిన పేర్లలో లక్ష్మణ్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే.