కేటీఆర్ మాస్టర్ స్ట్రోక్.. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ప్రతిపక్షాలకు గట్టి షాకిచ్చేలా ‘విజయగర్జన’ సభను విజయవంతం చేయాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం లేదని అందరి తెల్సివచ్చేలా ఈ సభను నిర్వహించేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ గ్రామం నుంచి జనాలను బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా రంగంలోకి దిగుతున్నారు.
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
విజయగర్జన సభకు ఇన్ చార్జిగా మంత్రి కేటీఆర్ వ్యవహరించనుండగా పర్యవేక్షణ బాధ్యతను ఎంపీ కేశవరావు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ప్రతీరోజు 20నియోజకవర్గాల వర్గాల ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటి కానున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీఆర్ఎస్ భవన్లో 20మంది ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే వాటిపై ఆయన ఆరా తీస్తున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రజల్లోకి ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? ప్రజల మన్నలను పొందేలా ఇంకా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించవచ్చు అనే వాటిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరారు.
టీఆర్ఎస్ ను గ్రామస్థాయిలో మరింత బలపరిచేలా ఎమ్మెల్యేలంతా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈమేరకు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా విజయగర్జన సభను విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలంతా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రతీ రోజు 20మంది చొప్పున దాదాపు 400మంది టీఆర్ఎస్ ముఖ్య నేతలను భేటికానున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లో నిర్వహించే ఈ సభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు గట్టి షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఆపార్టీ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!