కేటీఆర్ మాస్టర్ స్ట్రోక్.. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ప్రతిపక్షాలకు గట్టి షాకిచ్చేలా ‘విజయగర్జన’ సభను విజయవంతం చేయాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం లేదని అందరి తెల్సివచ్చేలా ఈ సభను నిర్వహించేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ గ్రామం నుంచి జనాలను బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా రంగంలోకి దిగుతున్నారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
విజయగర్జన సభకు ఇన్ చార్జిగా మంత్రి కేటీఆర్ వ్యవహరించనుండగా పర్యవేక్షణ బాధ్యతను ఎంపీ కేశవరావు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ప్రతీరోజు 20నియోజకవర్గాల వర్గాల ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటి కానున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీఆర్ఎస్ భవన్లో 20మంది ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే వాటిపై ఆయన ఆరా తీస్తున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రజల్లోకి ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? ప్రజల మన్నలను పొందేలా ఇంకా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించవచ్చు అనే వాటిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరారు.
టీఆర్ఎస్ ను గ్రామస్థాయిలో మరింత బలపరిచేలా ఎమ్మెల్యేలంతా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈమేరకు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా విజయగర్జన సభను విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలంతా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రతీ రోజు 20మంది చొప్పున దాదాపు 400మంది టీఆర్ఎస్ ముఖ్య నేతలను భేటికానున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లో నిర్వహించే ఈ సభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు గట్టి షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఆపార్టీ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!