కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని.. ప్రజలు నన్ను గెలిపియ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
రోజ్గార్ మేళా 2023లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు 51 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి మేళాను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కాకుండా పని చేస్తుందని అన్నారు.
ప్రతి వ్యక్తి గుర్తింపును నిర్ధారించడం నేటి అతిపెద్ద అవసరం. ఇప్పటి వరకు ఆధార్ కార్డు బయోమెట్రిక్ గుర్తింపు దీన్ని సులభతరం చేసింది. ఇందులో కళ్ల కనుపాప, వేలిముద్ర, ముఖ ఛాయాచిత్రం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, ఇది ఒక వ్యక్తి గోప్యతను కూడా ఉల్లంఘిస్తుంది.
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్పై ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసిన ఆలౌట్ అయింది. స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు విజయం కోసం చాలా కష్టపడింది.
2వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వర (బసవన్న) పేరు మీదుగా విజయపుర జిల్లా పేరును మార్చాలని డిమాండ్లు ఉన్నాయని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ శుక్రవారం అన్నారు. కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని 'బసవ నాడు' (బసవ భూమి)గా మార్చడంలో తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి.
డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు.
హెచ్సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసిన కేసులో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్పై ఉన్నాయి.
ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతోంది. మొత్తం 5 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేనకు తదుపరి సవాలు ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే మ్యాచే. ఇంగ్లండ్ 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయింది.
అయోధ్యలో రామ మందిరం త్వరలో సిద్ధమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆలయ నిర్మాణంలో హిందూ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్యుల సహకారాన్ని కొనియాడారు.