Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Free Laptops Subsidised Lpg Among Congress 7 Guarantees To Rajasthan

Congress: ఉచిత ల్యాప్‌టాప్‌లు, సబ్సిడీ ఎల్‌పీజీ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హామీల వర్షం

Published Date :October 27, 2023 , 9:25 pm
By Mahesh Jakki
Congress: ఉచిత ల్యాప్‌టాప్‌లు, సబ్సిడీ ఎల్‌పీజీ..  రాజస్థాన్‌లో కాంగ్రెస్ హామీల వర్షం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Congress: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జైపూర్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. నవంబర్ 25 ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ప్రతిపాదించిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడను కిలో రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తుందని తెలిపారు. “నిన్న నేను ఐదు హామీలను ప్రకటించాలని సూచించాను. చర్చించిన తర్వాత హామీలు ఇవ్వాలి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్‌ను నిర్ధారించడానికి మేము చట్టం చేస్తాము, తద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఓపీఎస్‌ను ఆపదు” అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

Also Read: Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా ఇదే..!

తమ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు మూడేళ్ల పాటు కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ సర్వీస్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా అందజేస్తుందని అశోక్ గెహ్లాట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం విద్య హామీని ప్రకటించారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500 చొప్పున వంట గ్యాస్ సిలిండర్లు, కుటుంబానికి చెందిన మహిళకు వాయిదాల పద్ధతిలో రూ.10,000 వార్షిక గౌరవ వేతనంతో సహా రెండు హామీలు అదనంగా ఉన్నాయి. బుధవారం జుంజునులో ప్రియాంక గాంధీ వాద్రా బహిరంగ ర్యాలీలో అశోక్ గెహ్లాట్ ఈ రెండు పథకాలను ఇప్పటికే ప్రకటించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని సకాలంలో నెరవేర్చామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. గత సారి రాహుల్ గాంధీ ఏడు రోజుల్లో (రైతుల) రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని సకాలంలో నెరవేర్చారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.

అయితే, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడుల గురించి మాట్లాడుతూ, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడుతున్నందున దోతస్రాను ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశంలో కుక్కల కంటే ఎక్కువగా ఈడీ తిరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏముంటుందన్నారు అశోక్ గెహ్లాట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashok Gehlot
  • congress
  • Guarantees
  • Rajashan Assembly Elections
  • Rajasthan

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions