Congress: ఉచిత ల్యాప్టాప్లు, సబ్సిడీ ఎల్పీజీ.. రాజస్థాన్లో కాంగ్రెస్ హామీల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జైపూర్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. నవంబర్ 25 ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ప్రతిపాదించిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడను కిలో రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తుందని తెలిపారు. “నిన్న నేను ఐదు హామీలను ప్రకటించాలని సూచించాను. చర్చించిన తర్వాత హామీలు ఇవ్వాలి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ను నిర్ధారించడానికి మేము చట్టం చేస్తాము, తద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఓపీఎస్ను ఆపదు” అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
Also Read
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
- PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
- Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
Also Read: Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా ఇదే..!
తమ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు మూడేళ్ల పాటు కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ సర్వీస్తో కూడిన స్మార్ట్ఫోన్లను కూడా అందజేస్తుందని అశోక్ గెహ్లాట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం విద్య హామీని ప్రకటించారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500 చొప్పున వంట గ్యాస్ సిలిండర్లు, కుటుంబానికి చెందిన మహిళకు వాయిదాల పద్ధతిలో రూ.10,000 వార్షిక గౌరవ వేతనంతో సహా రెండు హామీలు అదనంగా ఉన్నాయి. బుధవారం జుంజునులో ప్రియాంక గాంధీ వాద్రా బహిరంగ ర్యాలీలో అశోక్ గెహ్లాట్ ఈ రెండు పథకాలను ఇప్పటికే ప్రకటించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీని సకాలంలో నెరవేర్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. గత సారి రాహుల్ గాంధీ ఏడు రోజుల్లో (రైతుల) రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని సకాలంలో నెరవేర్చారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.
అయితే, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడుల గురించి మాట్లాడుతూ, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడుతున్నందున దోతస్రాను ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశంలో కుక్కల కంటే ఎక్కువగా ఈడీ తిరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏముంటుందన్నారు అశోక్ గెహ్లాట్.
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!