Congress: ఉచిత ల్యాప్టాప్లు, సబ్సిడీ ఎల్పీజీ.. రాజస్థాన్లో కాంగ్రెస్ హామీల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జైపూర్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. నవంబర్ 25 ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ప్రతిపాదించిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవు పేడను కిలో రూ. 2 చొప్పున కొనుగోలు చేస్తుందని తెలిపారు. “నిన్న నేను ఐదు హామీలను ప్రకటించాలని సూచించాను. చర్చించిన తర్వాత హామీలు ఇవ్వాలి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ను నిర్ధారించడానికి మేము చట్టం చేస్తాము, తద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఓపీఎస్ను ఆపదు” అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Also Read: Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా ఇదే..!
తమ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు మూడేళ్ల పాటు కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ సర్వీస్తో కూడిన స్మార్ట్ఫోన్లను కూడా అందజేస్తుందని అశోక్ గెహ్లాట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం విద్య హామీని ప్రకటించారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500 చొప్పున వంట గ్యాస్ సిలిండర్లు, కుటుంబానికి చెందిన మహిళకు వాయిదాల పద్ధతిలో రూ.10,000 వార్షిక గౌరవ వేతనంతో సహా రెండు హామీలు అదనంగా ఉన్నాయి. బుధవారం జుంజునులో ప్రియాంక గాంధీ వాద్రా బహిరంగ ర్యాలీలో అశోక్ గెహ్లాట్ ఈ రెండు పథకాలను ఇప్పటికే ప్రకటించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీని సకాలంలో నెరవేర్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. గత సారి రాహుల్ గాంధీ ఏడు రోజుల్లో (రైతుల) రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని సకాలంలో నెరవేర్చారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.
అయితే, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడుల గురించి మాట్లాడుతూ, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడుతున్నందున దోతస్రాను ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశంలో కుక్కల కంటే ఎక్కువగా ఈడీ తిరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏముంటుందన్నారు అశోక్ గెహ్లాట్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?