ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు.
సినీ నటి రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రేపే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాజస్థాన్లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గాలి తీవ్రత పెరిగిపోతుండటంతో దేశ రాజధానిలోని 14 ప్రాంతాలలో ఏక్యూఐ (AQI) 400 కంటే ఎక్కువగా నమోదు అవుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.
దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.