పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా అనే పథకం కాదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది.
వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.
బంగ్లాదేశ్ కు తరచూ వెళ్లి వచ్చే ఇలియాస్ అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో పాటు పలువురు పాకిస్తానీయులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడింది. ఎలాగైనా ఇలియాస్ ను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడ్ని చేర్చారు.
కార్తీక మాసం పోయిన తరువాత చికెన్ ధరలు క్రమంగా పెరగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మార్కెట్లో చికెన్ ధరలను పరిశీలిస్తే కిలో చికెన్ స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
నేటి నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇవాళ జోహన్నెస్బర్గ్ వేదికగాఇమధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ఆరంభం కాబోతుంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.
టీమిండియా సారథి, రోహిత్ శర్మ అభిమానులు లక్షలాది మంది ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 8 లక్షల మంది ఎమ్ఐ టీమ్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించక ముందు ఇన్ స్టాలో ముంబైకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండేది.
అనంతపురం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.