బుధవారం నాడు రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటంతో రాక్ఫాల్ల కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశాం.. తర్వాత లోక్ సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు.
త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలను సైతం బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో అలయెన్స్ లో ఉన్న వారిని కమలం పార్టీ ఇబ్బందులు పెడుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఇవాళ ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు.
సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు.