Yanamala Ramakrishnudu: అప్పుల ఊబిలో ఏపీ ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు.
రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తిరిగి చెల్లించే స్థితిలో లేవు.వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను కేంద్రం ఎంతకాలం రక్షిస్తుంది?మరలా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని జగన్ చూస్తున్నారన్నారు యనమల.
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
జగన్ తన పార్టీ గురించి తప్ప రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడం లేదు.అవినీతి సొమ్ము జమచేసుకుని దానితో రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారు.అవినీతి, అక్రమాలు, లూటీతో జగన్ సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలి.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నగదు బదిలీ పథకం ఒక ప్రహసనం లాంటిది.విదేశీ విద్య తీసేసి విద్యార్థులను మోసం చేశారు.
45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మహిళలను మోసం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పింఛన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు.కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రైతులకు 12,500 ఇస్తానని, రూ.6,500 ఇచ్చి మోసం చేశారు. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తానని మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులును మోసం చేశారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని ఒక్కరికి మాత్రమే ఇస్తామంటూ మోసం చేశారు.
Read Also: Lock Down Village: వెన్నెలవలస.. అక్కడ ఇప్పటికీ లాక్ డౌన్
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..