MP Margani Bharat: బైక్స్పై రాజమండ్రి నుంచి అయోధ్యకు యువకులు.. ఆల్ దీ బెస్ట్ చెప్పిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు.. ఆ రాముడే మీ వెంట ఉంటాడని చెప్పుకొచ్చారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఈ యువకుల బైక్ యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో ఎంపీ మార్గాని భరత్ పర్యటనకు సంబంధించి వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
Read Also: Rajasthan Covid: ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు పోస్ట్ కోవిడ్
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఇక, మూడు రోజులలో అయోధ్య చేరుకుంటామని ఆ యువకులు ఎంపీ మార్గాని భరత్ కు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, మిత్రులతో మాట్లాడటమే కాకుండా ‘యూ ట్యూబ్’ ద్వారా ప్రజలకు తమ ప్రయాణ వివరాలు తెలియజేస్తుంటామని చెప్పుకొచ్చారు. తాడేపల్లిగూడెంకు చెందిన ప్రణీత్ బైక్ పై ముంబాయి, కర్ణాటక వెళ్ళగా.. కాకినాడకు చెందిన తేజ్ తరుణ్ 19 రాష్ట్రాలు పర్యటించి వచ్చినట్లు ఎంపీ భరత్ కు వెల్లడించారు. వీరిద్దరూ ‘గోదావరబ్బాయి’ యూట్యూబ్, నేషనల్ ఈవెంట్స్ బైక్ రైడింగ్స్ లో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చారు.
Read Also: Delhi: సరికొత్త చరిత్ర సృష్టించిన ఢిల్లీ వైద్యులు
అయితే, అన్ని రకాల రక్షణ చర్యలు, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ బైక్స్ పై పర్యటించడం తమకు అలవాటని ఇద్దరు యువకులు ఎంపీ మార్గాని భరత్ కు వెల్లడించారు. రాజమండ్రి నగర రూపురేఖలు మార్చిన మీరు ఎమ్మెల్యేగా గెలవాలని అయోధ్యలో రాముడిని కోరనున్నట్టు ఎంపీకి తెలిపారు. బైక్స్ పై అయోధ్య వెళుతున్న ఈ యువకులను భరత్ అభినందించారు. దేశ జనాభాలో 60 శాతం మంది యువకులు ఉన్నారు.. వీరంతా దేశ పటిష్టతకు, దేశాభివృద్ధికి అడుగులు ముందుకు వేయాలన్నారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానంలో నిలిచిన యువతను స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా లక్ష్య సాధనకు కృషి చేయాలని ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు, నగర వాసులు, వైసీపీ శ్రేణులు, రామ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బైక్ రైడర్స్ కు ‘ఆల్ దీ బెస్ట్’ చెప్పారు.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!