Gudivada Amarnath: మేయర్పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!
- గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి..
- మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు..
- విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారన్న గుడివాడ అమర్నాథ్..
Gudivada Amarnath: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్… విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం ఖాయం అన్నారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మా నాయకుడు జగన్.. మేయర్ పదవి ఇచ్చారు.. కానీ, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారని మండిపడ్డారు.
Read Also: Ashwin- Dhoni: అశ్విన్.. ధోనీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.. ఎందుకిలా చేశాడబ్బా?
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ఇక, 99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబడుతున్నారు. ఇదే తరహాలో భూముల కట్టబెడతామని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు.. అసలు టీసీఎస్ విశాఖ రాకముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు.. విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలను చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్..
Read Also: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస పరీక్షపై స్పందించిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు.. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు.. విలువలు విశ్వాసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను జగన్ కూర్చోబెట్టారు.. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైసీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం అన్నారు.. జగన్ సీఎంగా ఉన్నా టీడీపీ గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లాక్కోలేదన్నారు కురసాల కన్నబాబు..
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!