Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని బొత్స అన్నారు. టెంట్లు ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని ఆరోపించారు. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు, బాధితులపైనే చర్యలు తీసుకుని మల్లాది విష్ణును అదుపులోకి తీసుకెళ్లారని విమర్శించారు.
మల్లాది విష్ణును పోలీస్ వ్యాన్లో తరలిస్తున్న సమయంలో పార్టీ జెండా కర్రతో దాడి జరిగిందని, దీక్షా శిబిరంలోని టెంట్పై మూత్ర విసర్జన చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ శిబిరాలను పలుచోట్ల పోలీసులు తొలగించారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై తమ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిపోయి, ఆందోళనలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు. ఎన్ని దాడులు, దౌర్జన్యాలు జరిగినా తమ ఉద్యమం ఆగదని, డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ..
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
తాజావార్తలు
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!