Congress: వీరిద్దరూ కలిసి వచ్చారంటే విశాఖ ఉక్కును అమ్మడం ఎవరి తరం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నలుగురు పాడేకట్టారని ఆరోపించారు. ఆ పాపంలో మోడీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. ఉక్కును అమ్మకానికి పెడితే అడ్డుకోలేని వీళ్ళందరినీ ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోస పూరిత పార్టీలకు పాతర వేయాలని సూచించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. వీళ్ళకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలిసిందేనని మండిపడ్డారు.
Read Also: PM Modi: హెడ్లైన్స్ కోసం కాదు.. డెడ్లైన్ల కోసం పని చేస్తున్నా..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రెబల్ రేవంత్ రెడ్డి, ఏపీలో కాంగ్రెస్ కు ఆక్సిజన్ ఇస్తున్న షర్మిళ కలిసి వచ్చారంటే విశాఖ ఉక్కును అమ్మడం ఎవరి తరం కాదని అన్నారు. అదానీ అంటే గంజాయి స్మగ్లర్ ఆయన గురువు మోడీ అని విమర్శించారు. విశాఖ ఉక్కు భూములను గంజాయి గోదాములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి ఎవరు మద్దతు ఇచ్చిన వాళ్ళు ద్రోహులు కిందేనని అన్నారు. తెలుగు ప్రజానీకానికి మొదటి శత్రువు మోడీ.. ఘోరీ కట్టాలిసిందేనని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం ప్రేమ లేఖలు రాస్తే కేంద్రం తలోగ్గదని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. పోరాటానికి మేం సిద్ధం.. ప్రభుత్వం సిద్ధం అవునో కాదో చెప్పాలన్నారు.
Read Also: Razakar: సివిల్స్ వదిలేసి నటన వైపు.. ఆసక్తికరంగా రజాకార్ నటి జర్నీ..!
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!