PM Modi: హెడ్లైన్స్ కోసం కాదు.. డెడ్లైన్ల కోసం పని చేస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తాను హెడ్లైన్ల కోసం పని చేయనని, డెడ్లైన్ల కోసం పని చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ కాంక్లేవ్లో మోడీ వ్యాఖ్యలు.. సుదీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాలనే తన ఉత్సాహాన్ని చాటాయి. “హెడ్లైన్స్ పర్ నహీ, డెడ్లైన్స్ పర్ కమ్ కర్నే వాలా ఆద్మీ హూన్” (నేను హెడ్లైన్ల కోసం పనిచేసే వ్యక్తిని కాదు, బదులుగా గడువులో పని చేసేవాడిని)” అని ప్రధాని మోడీ హిందీలో అన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘ ఎన్నికలు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
రాబోయే దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేయడంపైనే తన దృష్టి, సన్నాహాలు ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. తన దృష్టిని 2029పై పెట్టలేదని, అయితే తాను 2047కి సిద్ధమవుతున్నానని, లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రధాని అన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2024 గ్రాండ్ ఫినాలేలో ‘రీడిఫైనింగ్ భారత్’ సెషన్ కోసం ప్రధాని మోడీ వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘దేశం లక్ష్యం’ ‘విక్షిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం) అని, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అన్నారు.
భారత ఎన్నికల సంఘం ఈరోజు ముందుగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన తర్వాత ప్రధాని చేసిన తొలి వ్యాఖ్యలు ఇవి. అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ షెడ్యూల్ “అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ” అని అన్నారు. భారతదేశంలోని 600 కంటే ఎక్కువ జిల్లాల్లో స్టార్టప్లు ఉన్నాయని, 10 ఏళ్ల క్రితం ఉన్న సంఖ్యను పోల్చి చూస్తే, ఆ సమయంలో దాదాపు 100 స్టార్టప్లు ఉంటే.. అయితే అది నేడు 1.25 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఈ స్టార్టప్లు 600లకు పైగా జిల్లాల్లో ఉండడం పెద్ద విషయమన్నారు. లేకుంటే స్టార్టప్ అంటే బెంగుళూరు అని జనాలు ఊహిస్తారన్నారు. స్టార్టప్లను ప్రారంభించిన టైర్ 2, 3 నగరాల్లోని యువకులను కూడా ప్రశంసించారు. మరియు వారి విజయం భారతదేశ స్టార్టప్ ఉద్యమాన్ని నడిపించిందని అన్నారు. స్టార్టప్ల గురించి ఎప్పుడూ చర్చించని పార్టీ ఈరోజు కూడా దాని గురించి మాట్లాడవలసి వచ్చింది” అని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాన మంత్రి ముద్రా యోజన గురించి కూడా మాట్లాడిన ప్రధాన మంత్రి.. బ్యాంకులకు గ్యారెంటీగా చూపించడానికి ఏమీ లేని యువతకు రుణాలు అందించారని చెప్పారు. ఈ పథకం ద్వారా రూ. 26 లక్షల కోట్లు చిన్న పారిశ్రామికవేత్తలకు అందజేయడం జరిగిందని, అందులో ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారేనని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!