TJR Sudhakar Babu: పవన్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం.. ఎమ్మెల్యే టీజేఆర్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TJR Sudhakar Babu Fires On Pawan Kalyan Over Volunteer Issue: వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఆయన మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ తైతక్కలాడితే.. ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారానే పథకాలు అందచేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలను వద్దంటున్న పవన్.. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన దోపిడీలపై పవన్ కూడా నిలదీసి ధర్నాలు చేసిన విషయం నిజం కాదా..? అని నిలదీశారు. గతంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించిన విధంగా పవన్ ఎందుకు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని అడిగారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ఎందుకు తపిస్తున్నారో స్పష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని.. లేకపోతే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
Bengaluru Meeting: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం…. హాజరు కానున్న సోనియాగాంధీ
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకోవాలని సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే బదులు.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొని రావడానికి కృషి చేయాలన్నారు. దొంగలకు చంద్రబాబు, దోపిడీకి టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. డేటా దొంగిలిస్తున్నామని ఆరోపణలు చేసే ముందు.. ఎవరి డేటా చోరీ చేశామో సమాధానం చెప్పాలన్నారు. ఫదకాల అమలు కోసం తప్ప ప్రజల నుంచి వివరాలు తీసుకునే అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!