TJR Sudhakar Babu: పవన్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం.. ఎమ్మెల్యే టీజేఆర్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TJR Sudhakar Babu Fires On Pawan Kalyan Over Volunteer Issue: వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఆయన మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ తైతక్కలాడితే.. ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారానే పథకాలు అందచేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలను వద్దంటున్న పవన్.. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన దోపిడీలపై పవన్ కూడా నిలదీసి ధర్నాలు చేసిన విషయం నిజం కాదా..? అని నిలదీశారు. గతంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించిన విధంగా పవన్ ఎందుకు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని అడిగారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ఎందుకు తపిస్తున్నారో స్పష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని.. లేకపోతే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
Bengaluru Meeting: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం…. హాజరు కానున్న సోనియాగాంధీ
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకోవాలని సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే బదులు.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొని రావడానికి కృషి చేయాలన్నారు. దొంగలకు చంద్రబాబు, దోపిడీకి టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. డేటా దొంగిలిస్తున్నామని ఆరోపణలు చేసే ముందు.. ఎవరి డేటా చోరీ చేశామో సమాధానం చెప్పాలన్నారు. ఫదకాల అమలు కోసం తప్ప ప్రజల నుంచి వివరాలు తీసుకునే అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!