Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Cheated Businessmen In Anantapur In The Name Of Delivery Services: కొడితే కుంభస్థలమే బద్దలుకొట్టాలి అన్నట్టు.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో.. ఏకంగా ప్రముఖులకే కుచ్చటోపీ పెట్టాడు. రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడపలోని రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం ఓ గోదాంలో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి, ఘనంగా ప్రారంభోత్సవాన్ని జరిపించాడు. అతనిచ్చిన ఈ బిల్డప్ చూసే.. ప్రముఖులు అతని ట్రాప్లో చిక్కుకున్నారు.
Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక ప్రారంభోత్సవం అనంతరం అంకుశం తన వ్యాపారం గురించి వారికి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేస్తే.. ఖర్చులు తగ్గి, భారీగా ఆదాయం వస్తుందని చెప్పాడు. సరుకును విక్రయించిన తర్వాత తన కమీషన్ మాత్రమే పట్టుకొని, మిగులు మొత్తాన్ని అందజేస్తానని పేర్కొన్నాడు. అతడిచ్చిన బిల్డప్, చెప్పిన మాటలు చూసి.. ప్రముఖులు టెంప్ట్ అయ్యారు. అతనితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వద్ద ఉన్న సరుకుల్ని అప్పగించారు. ఆ సరుకులతో గోదాం మొత్తం నిండిపోవడంతో.. అంకుశం బాగానే వ్యాపారం చేస్తున్నాడని వ్యాపారులు మురిసిపోయారు. తమకు ఇక డబ్బే డబ్బు వస్తుందని ఆశించారు. కానీ.. అంకుశం రాత్రికిరాత్రే ప్లేటు ఫిరాయించడం చూసి, వాళ్లు ఖంగుతిన్నారు.
Bhumana Karunakar Reddy: తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టుంది.. ఎమ్మెల్యే భూమన ఫైర్
తన గోదాం నిండిన తర్వాత అంకుశం లారీలకొద్దీ సరుకుని తీసుకుని, రాత్రికిరాత్రే మాయమైపోయాడు. ఆ సరుకు విలువ మొత్తం రూ.70 లక్షలు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన వ్యాపారులు.. నేరుగా అతని ఇంటికి వెళ్లారు. అయితే.. కుటుంబసభ్యులు ఎదురుదాడికి దిగడంతో, గత్యంతరం లేక వ్యాపారులు అనంతపురం తిరిగొచ్చి పోలీసులకు తమకు జరిగిన మోసాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నెల్లూరులో రూ.3 కోట్లు, కర్నూలులో రూ. కోటికి పైగా వ్యాపారులు.. అంకుశం చేతిలో మోసపోయినట్లుగా తేలింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!