Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Cheated Businessmen In Anantapur In The Name Of Delivery Services: కొడితే కుంభస్థలమే బద్దలుకొట్టాలి అన్నట్టు.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో.. ఏకంగా ప్రముఖులకే కుచ్చటోపీ పెట్టాడు. రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడపలోని రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం ఓ గోదాంలో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి, ఘనంగా ప్రారంభోత్సవాన్ని జరిపించాడు. అతనిచ్చిన ఈ బిల్డప్ చూసే.. ప్రముఖులు అతని ట్రాప్లో చిక్కుకున్నారు.
Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Also Read
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ఇక ప్రారంభోత్సవం అనంతరం అంకుశం తన వ్యాపారం గురించి వారికి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేస్తే.. ఖర్చులు తగ్గి, భారీగా ఆదాయం వస్తుందని చెప్పాడు. సరుకును విక్రయించిన తర్వాత తన కమీషన్ మాత్రమే పట్టుకొని, మిగులు మొత్తాన్ని అందజేస్తానని పేర్కొన్నాడు. అతడిచ్చిన బిల్డప్, చెప్పిన మాటలు చూసి.. ప్రముఖులు టెంప్ట్ అయ్యారు. అతనితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వద్ద ఉన్న సరుకుల్ని అప్పగించారు. ఆ సరుకులతో గోదాం మొత్తం నిండిపోవడంతో.. అంకుశం బాగానే వ్యాపారం చేస్తున్నాడని వ్యాపారులు మురిసిపోయారు. తమకు ఇక డబ్బే డబ్బు వస్తుందని ఆశించారు. కానీ.. అంకుశం రాత్రికిరాత్రే ప్లేటు ఫిరాయించడం చూసి, వాళ్లు ఖంగుతిన్నారు.
Bhumana Karunakar Reddy: తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టుంది.. ఎమ్మెల్యే భూమన ఫైర్
తన గోదాం నిండిన తర్వాత అంకుశం లారీలకొద్దీ సరుకుని తీసుకుని, రాత్రికిరాత్రే మాయమైపోయాడు. ఆ సరుకు విలువ మొత్తం రూ.70 లక్షలు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన వ్యాపారులు.. నేరుగా అతని ఇంటికి వెళ్లారు. అయితే.. కుటుంబసభ్యులు ఎదురుదాడికి దిగడంతో, గత్యంతరం లేక వ్యాపారులు అనంతపురం తిరిగొచ్చి పోలీసులకు తమకు జరిగిన మోసాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నెల్లూరులో రూ.3 కోట్లు, కర్నూలులో రూ. కోటికి పైగా వ్యాపారులు.. అంకుశం చేతిలో మోసపోయినట్లుగా తేలింది.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!