Bengaluru Meeting: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం…. హాజరు కానున్న సోనియాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Meeting: 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకసారి బీహార్ రాజధాని పాట్నాలో గత నెల జూన్ 23న భేటీ అయ్యాయి. నేడు బెంగళూరులో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. బెంగుళూరులోని ఒక ప్రైవేటు హోటల్ వేదికగా విపక్షాల సమావేశం జరగనుంది. సమావేశం రేపు కూడా కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో జరిగే సమావేశానికి 24 పార్టీ లకు చెందిన 49 మంది ఆగ్రనేతలు హాజరుకానున్నారు. సమావేశంలో పాల్గొనడానికి బెంగుళూరు HAL airportకి మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేరుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఐక్యంగా ఉన్నామనే ప్రకటనతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తొలి సమావేశానికి 16 పార్టీలను ఆహ్వానించారు. అయితే మొదటి సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడంతో 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. నేడు జరిగే సమావేశంలో 24 పార్టీల అధినేతలు పాల్గొననున్నారు. విపక్షాల సమావేశానికి హాజరయ్యే అన్ని పార్టీ ల నేతలకు ఇవ్వాళ రాత్రికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిన్నర్ ఇవ్వనున్నారు. కాలు కి దెబ్బ తగిలినా…సోనియా గాంధీ ఆహ్వానం మేరకు TMC అధినేత మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read also: Kiran Abbavaram: ‘రూల్స్ రంజన్’ని రాధిక సమ్మోహన పరుస్తుందిగా
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలు ఏకం కావడంతో.. బీజేపీ కూడా తన స్పీడ్ పెంచింది. ఎన్డీఏ పక్ష మీటింగ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ పక్ష సమావేశానికి జనసేన పార్టీని కూడా ఆహ్వానించింది.
Read also: Sugar for Hair: తలకు చక్కెర వాడటం గురించి ఎప్పుడైనా విన్నారా?
ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పాట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్ఠాక్రే (ఎస్ఎస్–యుబీటీ), శరద్పవార్ (ఎన్సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), అఖిలేశ్యాదవ్ (ఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
Read also: IND Playing XI WI: విరాట్ కోహ్లీ ఔట్.. వెస్టిండీస్తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టిదే!
కాంగ్రెస్ మీటింగ్ జేడీఎస్ దూరం
నేడు జరిగే ప్రతిపక్షాల సమావేశానికి జేడీఎస్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రం లో 45 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే ..కర్నాటక లో కాంగ్రెస్ కూటమి రాజకీయాలు చేస్తోందంటూ జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి విమర్శించారు. కుమార స్వామి రేపు ఢిల్లీ కి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కుమారస్వామి బీజేపి తో పొత్తులకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. JDS తో పొత్తుకు కర్ణాటక బీజేపి నేతలు నో చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 20 MP స్థానాలు ఒంటరిగా పోటీ చేసి గెలిచామని కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నారు. కానీ కుమారస్వామి తో కలసి వెళ్లేందుకు ఢిల్లీ బీజేపి బాసులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?