Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ttd Is Planning To Build A Third Vaikuntam Q Complex

TTD: క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి.. టీటీడీ కీలక నిర్ణయం..

Published Date :September 5, 2025 , 8:30 am
By Sudhakar Ravula
  • గత 11ఏళ్లలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 కోట్ల మంది భక్తులు..
  • 2019లో రికార్డుస్థాయిలో 2 కోట్ల 76 లక్షల మందికి స్వామివారి దర్శనం..
  • ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు కోటి 76 లక్షల మందికి స్వామివారి దర్శనం..
  • 1943లో మొదటి ఘాట్‌ రోడ్‌, 1979లో రెండో ఘాట్‌ రోడ్‌ నిర్మాణం..
  • భక్తుల రద్దీ పెరిగేకొద్దీ క్యూలైన్ విధానంలో మార్పులు..
  • 1985లో, 2001లో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం..
  • 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు..
  • మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్న టీటీడీ..
TTD: క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి.. టీటీడీ కీలక నిర్ణయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TTD: 1950కి పూర్వం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. 1943కి పూర్వం తిరుమలకు చేరుకోవడానికి కేవలం నడక దారి మాత్రమే ఉండేది. 1943లో మొదటి ఘాట్ రోడ్‌ను, 1979లో రెండో ఘాట్ రోడ్‌ను నిర్మించింది టీటీడీ. ఘాట్‌రోడ్‌ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 1951లో రోజుకు సగటున 619 మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ ఏడాది మొత్తం 2 లక్షల 26 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కలిగింది. 1961లో రోజుకు సగటున 3,197 మంది, 1971లో రోజుకు 9,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 1981లో రోజువారీ దర్శనాల సంఖ్య ఏకంగా 21 వేల 786కి పెరిగింది. 1991లో రోజుకు 32 వేల 332 చొప్పున ఏడాది పొడవునా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి 18 లక్షలు దాటేసింది. 2001లో రోజుకు 65 వేల మంది, 2011లో 70 వేల చొప్పున స్వామిని దర్శించుకున్నారు. 2021లో కోవిడ్‌ ఇయర్‌ కావడంతో భక్తుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత కాలంలో మళ్లీ పెరిగింది.

Read Also: Donald Trump: మనసు మార్చుకున్న ట్రంప్.. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

Also Read

  • TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
  • TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
  • TTD Server Issue: టీటీడీ సర్వర్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు..
  • Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..

భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్‌ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది. 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. 2024 నాటికి గోగర్భం డ్యామ్‌ వరకు క్యూలైన్లను పెంచింది. ఇలా క్యూ లైన్‌లోనే 65 వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినా..స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటల పైబడి వేచి ఉండే సమయాలు ఏడాదికి 100 రోజులు పైగానే ఉన్నాయి.

Read Also: Digital Arrest : వృద్ధ దంపతులను బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చింది టీటీడీ. మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలో కుల శేఖర పడి వరకు అనుమతించేవారు. అప్పట్లో రోజుకు 20 వేల మంది వరకు మాత్రమే దర్శించుకోగలిగేవారు. 1983లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించేవారు. దీంతో రోజుకు 40 వేల మందికి దర్శనభాగ్యం లభించేది. 2005లో తెచ్చిన మహాలఘు దర్శన విధానంలో జయ విజయల గడప నుంచి రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులు..స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. మరోవైపు బంగారు వాకిలిలో మూడు క్యూ లైన్‌ల విధానాన్ని 2014లో ప్రవేశపెట్టారు. దీంతో బంగారు వాకిలి లోపల భక్తులు తోపులాట లేకుండా స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభించింది.

Read Also: Astrology: సెప్టెంబర్‌ 5, శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలి..?

గత 11 ఏళ్లలో తిరుమల శ్రీవారిని 25 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. 2015 నుంచి చూస్తే 2019లో రికార్డుస్థాయిలో రెండు కోట్ల 76 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు కోటి 76 లక్షల మందికి దర్శనభాగ్యం లభించింది. మిగిలిన నాలుగు నెలల్లో మరో 80 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తుండడంతో మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు టీటీడీ ప్లాన్‌ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • third Vaikuntam Q Complex
  • tirumala
  • ttd
  • Vaikuntam Q Complex

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions