Digital Arrest : వృద్ధ దంపతులను బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుపోయిందని, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని భయపెట్టారు. అంతేకాకుండా, సీబీఐ, ట్రాయ్, ఆర్బీఐ పేర్లతో నకిలీ నోటీసులు పంపి మరింతగా బెంబేలెత్తించారు. ఈ భయంతో బాధితులు వీడియోకాల్ను కట్ చేయకుండా ఏకంగా 50 గంటలపాటు ఇంట్లోనే నిర్బంధితులుగా ఉన్నారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
తరువాత నిందితులు రూ.30 లక్షలు డిమాండ్ చేస్తే, భయంతో వృద్ధులు ఆన్లైన్లో డబ్బు బదిలీ చేశారు. ఇంతటితో ఆగకుండా, బాధితుడి బ్యాంక్ లాకర్లో బంగారం ఉన్న విషయం తెలిసిన సైబర్ నేరగాళ్లు, దానిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు పంపాలని ఒత్తిడి చేశారు. ఈ సమయంలో వృద్ధుడు తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆయన జరుగుతున్న మోసాన్ని గుర్తించి వెంటనే 1930 హెల్ప్లైన్కి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని మొత్తం 30 లక్షల్లో 20 లక్షలు స్తంభింపజేశారు. అయితే అప్పటికే నిందితులు 10 లక్షలను విత్డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, వీడియోకాల్లు, నకిలీ నోటీసులను నమ్మొద్దని సూచించారు. అదేవిధంగా అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే 1930 హెల్ప్లైన్కి ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!