Donald Trump: మనసు మార్చుకున్న ట్రంప్.. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు
- మనసు మార్చుకున్న ట్రంప్
- జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం, జపాన్ వాహనాలపై సుంకాలు ప్రస్తుత 27.5% నుంచి 15%కి తగ్గించబడతాయి. ఇది ఈ నెలాఖరు నాటికి అమల్లోకి రావచ్చు.
Also Read:Joe Biden: మాజీ అమెరికా అధ్యక్షుడుకు ఏమైంది? తలపై ఆ గాయమేంటి?
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
డొనాల్డ్ ట్రంప్ గురువారం కొత్త అమెరికా-జపాన్ వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిని ‘అమెరికా-జపాన్ వాణిజ్య సంబంధాల కొత్త శకం’ ప్రారంభం అని ఆయన అభివర్ణించారు. ఈ ఆర్డర్ అమెరికాలోకి జపాన్ దిగుమతులన్నింటిపై 15 శాతం బేస్లైన్ సుంకాన్ని విధిస్తుంది. అదే సమయంలో ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, ఏరోస్పేస్ ఉత్పత్తులు, జనరిక్ మందులు, దేశీయంగా అందుబాటులో లేని సహజ వనరులకు రంగాలవారీగా మినహాయింపులను అందిస్తుంది.
ప్రారంభ దశలో, ట్రంప్ ప్రభుత్వం జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈలోగా, అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిలిచిపోయాయి. ఇప్పుడు చివరకు ట్రంప్ పరిపాలన జపాన్పై 15 శాతం బేస్లైన్ సుంకం విధించడానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోకి దాదాపు అన్ని జపనీస్ దిగుమతులపై 15 శాతం బేస్లైన్ సుంకాన్ని విధిస్తుంది” అని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది.
Also Read:USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం”.. యూఎస్ ఇన్ఫ్లూయెన్సర్ల బలుపు మాటలు..
ఈ ఒప్పందం ప్రకారం, జపాన్ అమెరికాలో తయారైన వాణిజ్య విమానాలు, రక్షణ పరికరాలు, బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్స్, ఎరువులు బయోఇథనాల్ వంటి బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా కట్టుబడి ఉంది. టోక్యో కనీస యాక్సెస్ ప్లాన్ కింద బియ్యం దిగుమతులను 75 శాతం పెంచడానికి అంగీకరించింది, దీని వలన జపాన్కు అమెరికా వ్యవసాయ ఎగుమతులు సంవత్సరానికి దాదాపు $8 బిలియన్లకు పెరుగుతాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..