Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Devotees Clash: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ ఎఫెక్ట్ తగిలింది.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు సహనం కోల్పోతూ పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో సంయమనం పాటించాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని టిటిడి అధికారులు గతంలోనే భక్తులకు సూచించారు. అయితే కొంతమంది భక్తులు టిటిడి విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం వల్ల ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read
ఇక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి పాలకమండలి సభ్యుడు సుదర్శన్ వేణు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 15వ తేదీ వరకు తన సిఫార్సు లేఖల కోటాను 50 శాతానికి తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అదనపు టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లకు చేరగా, లడ్డు ప్రసాదం విక్రయాలు 4.15 లక్షలకు నమోదయ్యాయి. మరోవైపు అన్నప్రసాద వితరణ ద్వారా సుమారు 2.7 లక్షల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించినట్లు టిటిడి వెల్లడించింది. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు సహనం పాటించాలని, టిటిడి అధికారులకు సహకరించాలని ఆలయ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు.. ఆర్సీబీ ఆటగాళ్లను పక్కనపెట్టిన బీసీసీఐ!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
-
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!