Mahanadu 2022: నేడు ఒంగోలుకు టీడీపీ అధినేత.. విజయవాడ నుంచి బైక్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలు వెళ్లనున్నారు.. మూడు రోజుల పాటు అక్కడే బసచేయనున్నారు.. ఇవాళ ఒంగోలు వెళ్లనున్న ఆయన.. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు.. ఇక, చంద్రబాబు పర్యటన సందర్భంగా… విజయవాడ నుండి ఒంగోలు వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి టీడీపీ శ్రేణులు… ఆ బైక్ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు నుండే స్వాగత ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.. మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఒంగోలు చేరుకోనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం కానుంది.. మహానాడులో చర్చించే పలు కీలక అంశాలపై ఈ సమవేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు టీడీపీ నేతలు.. మొత్తంగా మూడు రోజుల పాటు ఒంగోలులోనే బస చేయనున్నారు చంద్రబాబు.
Read Also: YSRCP: వైసీపీకి షాక్.. మూకుమ్మడి రాజీనామాలు..!
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, తెలుగుదేశం పార్టీ పండుగగా చెప్పుకునే మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది ఆ పార్టీ.. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని.. అలాగే భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ఈ నెల 27, 28వ తేదీల్లో ఒంగోలులోమహానాడు జరగనుండగా.. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఆ పార్టీ.. అయితే, అధికార వైసీపీ.. టీడీపీ మహానాడుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.. సభ కోసం స్థలం ఇవ్వక పోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడం, ప్రైవేట్ వాహనాలను అనధికారికంగా అజమాయిషీ చేస్తూ అధికార వైసీపీ అడ్డంకులు పెడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా అసలుసిసలు తెలుగు పండుగ మహానాడును విజయవంతం చేస్తామంటున్నారు నేతలు.
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!