Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.. టీడీపీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదంలో.. టీడీపీ కార్యాలయం ధ్వంసం అయ్యింది.. పలు కార్లను కూడా ధ్వంసం చేశారు.. ఓ కారుకు నిప్పుపెట్టారు.. కార్యాలయంలో ఫర్నీచర్, అద్దాలు పగలగొట్టారు.. ఇక, ఈ దాడికి నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది.. రోడ్డుపై బైఠాయించారు టీడీపీ నేతలు.. దీంతో మళ్లీ మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేత పట్టాభి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.. మరోవైపు.. గన్నవరం ఘటనలో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.. రెండు కేసుల్లో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 143, 147, 149, 307 , 333, 341, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు పెట్టారు.
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?
Also Read
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
గన్నవరంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు గన్నవరం సీఐ కనకారావు.. ఈ కేసులో ఏ1 గా పట్టాభి, ఏ2గా దొంతి చిన్నాతో పాటు మరో 15 మంది పై కేసులు నమోదు చేశారు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు సీమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇక, రమేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో 143, 147, 149, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసు పెట్టారు.. ఇక, అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను గన్నవరం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు..
Read Also: Pak University Exam: యూనివర్సిటీ పరీక్షలో బూతు ప్రశ్న.. అన్నాచెల్లి మధ్య లింక్!
మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశంపై సీసీ ఫుటేజ్ విడుదల చేసింది టీడీపీ.. పార్టీ కార్యాలయంలోకి దూసుకొచ్చి ఫర్నిచర్.. కంప్యూటర్లను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారని చెబుతున్నారు.. అయితే, అనంతరం వైసీపీ కార్యకర్తలను బయటకు పంపిన పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉన్న ఓ వస్తువును తీసుకెళ్లారని చెబుతున్నారు.. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం.. ఓ వస్తువును తన జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు కానిస్టేబుల్.. ఇంతకీ అది ఏంటి? అనేది తెలియాల్సి ఉండగా.. మేం బాధితులం.. మాపై కేసులు పెట్టడం ఏంటి.. అరెస్ట్లు చేయడం ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!