Taneti Vanitha: హోం మంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్.. రావణ కాష్టంలా మారింది ఏపీ..
- రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కరువైంది..
- ప్రజలకు పథకాలు ఇవ్వాలంటే భయమేస్తుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు..
- హోం మంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్.. రావణ కాష్టంలా మారింది ఏపీ: తానేటి వనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. జగనన్న మహిళలకు పెద్దపీట వేశారు.. జగనన్న దిశా యాప్ తెస్తే ఆ యాప్ ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు.. కానీ, ఇప్పుడు అదే దిశా యాప్ పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పెట్టారని ఎద్దేవా చేసింది. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతులను తగలబెట్టించారు.. ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.. ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు.. జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు అని తానేటి వనిత పేర్కొనింది.
Read Also: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
అయితే, ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ, భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు.. 40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి అని మాజీ హోంమంత్రి వనతి ప్రశ్నించింది. అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే నారా లోకేష్ అనరాని మాటలు అన్నారు.. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేష్ 2 వేలు కోత పెట్టారు అని మండిపడింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి.. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదని తానేటి వనతి పేర్కొనింది.
Read Also: Revanth Reddy: సోమవారం రైతులతో రేవంత్రెడ్డి ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు అని మాజీ మంత్రి వనిత మండిపడింది. వైసీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు.. చంద్రబాబుకి.. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇదే అని ఆమె తెలిపింది. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.. 33 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారన్నారు.. మరి ఇప్పుడు ఆ కనిపించకుండా పోయిన మహిళలను ఎవరు కనిపెట్టి తెస్తారని అడిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు.. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలని తానేటి వనిత క్వశ్చన్ చేసింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!