Taneti Vanitha: హోం మంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్.. రావణ కాష్టంలా మారింది ఏపీ..
- రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కరువైంది..
- ప్రజలకు పథకాలు ఇవ్వాలంటే భయమేస్తుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు..
- హోం మంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్.. రావణ కాష్టంలా మారింది ఏపీ: తానేటి వనిత
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. జగనన్న మహిళలకు పెద్దపీట వేశారు.. జగనన్న దిశా యాప్ తెస్తే ఆ యాప్ ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు.. కానీ, ఇప్పుడు అదే దిశా యాప్ పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పెట్టారని ఎద్దేవా చేసింది. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతులను తగలబెట్టించారు.. ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.. ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు.. జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు అని తానేటి వనిత పేర్కొనింది.
Read Also: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అయితే, ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ, భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు.. 40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి అని మాజీ హోంమంత్రి వనతి ప్రశ్నించింది. అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే నారా లోకేష్ అనరాని మాటలు అన్నారు.. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేష్ 2 వేలు కోత పెట్టారు అని మండిపడింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి.. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదని తానేటి వనతి పేర్కొనింది.
Read Also: Revanth Reddy: సోమవారం రైతులతో రేవంత్రెడ్డి ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు అని మాజీ మంత్రి వనిత మండిపడింది. వైసీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు.. చంద్రబాబుకి.. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇదే అని ఆమె తెలిపింది. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.. 33 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారన్నారు.. మరి ఇప్పుడు ఆ కనిపించకుండా పోయిన మహిళలను ఎవరు కనిపెట్టి తెస్తారని అడిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు.. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలని తానేటి వనిత క్వశ్చన్ చేసింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!